అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. తొలుత అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు జనవరి 12 వ తేదీనే విడుదల చేస్తామని ఈ రెండు చిత్రాల నిర్మాతలు ప్రకటించారు. కానీ ఆ తరువాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావటం మంచిది కాదని రెండు చిత్రాల నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
నిర్మాతలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అల వైకుంఠపురములో సినిమా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ సినిమాను ప్రీ పోన్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అల వైకుంఠపురములో సినిమా జనవరి 11వ తేదీన లేదా జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు ఒక రోజు గ్యాప్ తో విడుదలైనా పరవాలేదు కానీ ఒకే రోజు విడుదలైతే మాత్రం రెండు సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్లను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే కొత్త ఫస్ట్ డే రికార్డులు కూడా నమోదయ్యే అవకాశం లేదు. రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే పరవాలేదు కానీ కొంచెం నెగిటివ్ టాక్ వస్తే నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ గురించి ఈరోజు సాయంత్రం లేదా రేపు స్పష్టత రానుందని సమాచారం. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని అల్లు అర్జున్ అభిమానులు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: