కేవలం కొన్ని గంటల్లోనే పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పబోతున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక కొత్త వస్తుందంటే పాత విషయాలను.. ముఖ్యంగా ట్రెండింగ్ అయిన విషయాలను గుర్తుచేసుకుంటాం. అయితే 2019లో టాలీవుడ్లో ఓ విషయంలో రామ్ చరణ్ టాప్ ట్రెండింగ్లో నిలిచాడు. ఈ యేడాది రామ్ చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది.
పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్గా తెరకెక్కిన ‘వినయ విదేయ రామ’ సినిమా ట్రోలింగ్ విషయంలో టాలీవుడ్ టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రియాల్టీకి దూరంగా ఉన్నాయి. సాధారణంగా ప్రేక్షకులు సినిమాలో వచ్చే ఫైట్స్ కథలో భాగంగా చూస్తూ ఎంజాయ్ చేస్తారు కానీ.. పెద్దగా లాజిక్స్ పట్టించుకోరు. కానీ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలోని యాక్షన్ సీన్స్ చూసి ప్రేక్షకులు లాజిక్స్ విషయమై ఆలోచించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ సన్నివేశంలో హీరో విలన్ గ్యాంగ్లోని ఒక వ్యక్తి తల తెగొట్టి పైకి ఎగిరేస్తే.. గద్దలు తన్నుకోవడం వంటివి సీన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్కు గురైంది.
అలాగే ఈ సినిమాలోనే హీరో ట్రైన్ ఎక్కి భారత్.. నేపాల్ బార్డర్ చేరుకోవడం లాంటి సీన్స్ ప్రేక్షకులకు పంటి కింద రాయిలా భావించారు. రంగస్థలం లాంటి సినిమా తర్వాత చరణ్ ఈ కథ కు ఎలా ఓకే చెప్పాడంటూ అంత ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఈ చిత్రం 2020లో విడుదల కానుంది.