బిగ్ బాస్ షో అనేది ప్రస్తుతం రేటింగ్ ఉన్న బుల్లితెర షో. ఇది పేరుకే బుల్లితెర షో. కానీ పెద్ద పెద్ద తారాల్ని సైతం ఈ షోకు కట్టేసుకున్న బిగ్ స్క్రీన్ అనడం బెటరేమో. ఎందుకంటే దీనికి అయ్యే ఖర్చు కూడా మామూలుగా లేదండోయ్ అందుకే ఈ షోకు అంతా పాపులారిటి వచ్చింది. ఇకపోతే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ కూడా పేరున్న వారే. ఇక తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఈ బిగ్‌బాస్ షో అదిరే రేటింగ్స్ సాధించుకుంది. కాని ప్రతి ఎపిసోడ్‌లో వివాదస్పదంగా మిగిలింది. అయినా ఐడోంట్ కేర్ అంటూ విజయవంతంగా ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటూ రేసు గుర్రంలా పరిగెత్తుతుంది.

 

 

ఇదిలా ఉండగా హిందీలో టెలికాస్ట్ అయ్యే బిగ్‌బాస్ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్. ఒక్కో సీజన్‌కు తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్న కండలవీరుడు. ప్రస్తుతం నడుస్తున్న షో కోసం ఏకంగా 300 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం. ఇకపోతే హిందీలో ఈ షో గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.. ఇక ఇప్పుడు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ గొడవను చూస్తే. ఈ షోలో రష్మీ దేశాయ్ అదరగొట్టింది. సిద్దార్ధ్ రష్మీ ల మధ్య చాలా రొమాన్స్ నడిచింది. అంతే కాకుండా ఈ ఇద్దరు షోలో రొమాంటిక్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు కూడా. కానీ ఈ జంట బయటకు వచ్చిన తరువాత బద్ద శత్రువులుగా మారిపోయారు.

 

 

అంతే కాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాదు  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సిద్దార్ధ్ పై రష్మీ కామెంట్లు చేసింది. ఈ విషయంలో సిద్దార్ధ్ ను వివరణ అడగ్గా, కోపంతో ఊగిపోతూ, రష్మీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేమంటే రష్మీ ఓ అబద్ధాల కోరు. ఒకప్పుడు నాపై ఇష్టం పెంచుకుని, నేను గోవాలో ఉన్నానని తెలుసుకుని అక్కడి కూడా వచ్చేసిందని అనడంతో షాక్ అవడం అది విన్నవారి వంతైంది. ఇదిలా ఉండగా ఈ కామెంట్ పై రష్మీ, ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ కూడా విరుచుకుపడటం మరీ విశేషం అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: