టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  భారీ పెట్టుబడులు పెట్టి తీస్తున్న సినిమాలు నట్టేట్లో పుట్ట ముంచుతున్న విషయం తెలిసిందే.  ఇటీవల రిలీజ్ అయిన సాహూ, సైరా ఈ కోవలోకే వస్తాయి.  మరోవైపు మంచి కంటెంట్ తో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణతో పాటు కలెక్షన్లు కూడా వస్తున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో  మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్, రాశీఖన్న జంటగా నటించిన ‘ప్రతి రోజూ పండుగే’ మూవీ మంచి సక్సెస్ అందుకోవడమే కాదు కలెక్షన్లు కూడా బాగా రాబడుతున్నాయి. ఈ ఏడాది సాయిధరమ్ తేజ్ నటించిన ‘చిత్రలహరి’, ‘ ప్రతిరోజూ పండుగే’ మూవీస్ మంచి విజయం అందుకున్నారు.  

 

మూవీ నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని సంచలన విషయలు తెలిపారు.  సాధారణంగా తను ఏ సినిమా తీయాలనుకున్న కథ, డైరెక్టర్ బ్యాగ్ గ్రౌండ్, మ్యూజిక్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు.  గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా ప్రతిరోజు పండగే. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో అల్లు అరవింద్ కి చాలా అనుమానాలు వచ్చాయట.  అప్పటికే సాయిధరమ్ వరుసగా ఫెయిల్యూర్స్ లో ఉన్నారు..  మారుతీ కథ చెప్తున్న సమయంలో ఈ పాయింట్ జనాలకు ఎక్కుతుందా అని మొదట అనుకున్నాడట.  

 

ప్రస్తుతం సెంటిమెంట్స్ తో మూవీని జనాల్లోకి తీసుకుపోగలమా అని అనుకున్నారట. దాంతో మారుతి సరే మరో కథ చెబుతానని అనడంతో లేదు ముందు అనుకున్న కథతోనే సినిమా తీద్దామని చెప్పారట. ఆ తరువాత సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కాపీ చూసి చిత్ర యూనిట్ నవ్వుకున్నారట. మరి ఈ కాన్సెప్ట్ జనాలకు రీచ్ అవుతుందా లేదా అని అనుమానం కలిగిందట.. కానీ సినిమా రిజల్ట్ చూసిన తాను చాలా ఆశ్చర్యపోయానని.. తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మార్చుకున్నానని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: