భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి.  బాలనటిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టి స్టార్ హీరోలు సరసన నటించి అందరి మనసు దోచింది.  తెలుగు లో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు  తెచ్చుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది.  జాన్వి కపూర్, ఖుషీ కపూర్ లకు జన్మనిచ్చింది.  అయితే తన కూతుళ్లు మంచి హీరోయిన్లుగా చూసుకోవాలన్న శ్రీదేవి కల తీరకుండానే ఆమె కన్నుమూశారు. శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ నటించిన ధడక్ సినిమా మంచి విజయం అందుకుంది.  

 

ఒక్క సినిమాతోనే జాన్వీకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఇక  సినిమా అరంగేట్రం ఏమో గాని ముందు నుండే ఆమె ఎదో ఒక వివాదంలో మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె వేసుకొనే బట్టలే జాన్వీని బాగా ఎక్స్ పోజ్ చేస్తున్నాయి.  ఇక తాజాగా జాన్వి మరోసారి సోషల్ మీడియాలో చర్చనియంసంగా మారింది.  ఈ అమ్మడు ఓ కెమెరాకు చిక్కింది. పొట్టి నిక్కర్ తో ఉన్న ఈ అమ్మడు ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలానే పొట్టి డ్రెస్ లతో రోడ్ మీదకు వచ్చిన జాన్వీ ఫోటోలు వైరల్ అయ్యాయి.  ప్రస్తుతం జాన్వీ తెలుగు తమిళ భాషల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తుంది.. మంచి కథ, పేరున్న హీరో పక్కన ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను అంటుంది.. శ్రీదేవి కూడా సౌత్ లో బాగా పేరొచ్చాకే బాలీవుడ్ కి వెళ్ళింది.. అక్కడ ఆనతికాలం లోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.

 

తల్లిబాటలోనే తాను కూడా నడవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.  అయితే జాన్వీ పొట్టి పొట్టి దుస్తులే.. జిమ్ కి వెళ్లినా, ఫంక్షన్ కి వెళ్లినా ఆ టైపు బట్టలే వేసుకుని అందరిని తననే చూసేలా చేసుకుంటుంది.  ఆ మద్య ఓ విలేకరి మీరు ఎప్పుడూ పొట్టి దుస్తులే ఎందుకు వేసుకుంటారని ప్రశ్నిస్తే..  నేను మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అని కొంటెగా సమాధానం చెప్పిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: