డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఐకాన్. ఆయనా సినిమాలు ఎవరు తీయలేదు. అంటే ఆయనంత స్పీడ్ గా అని అర్థం. ఆయనలా డైలాగులు ఎవరు రాయలేరు. అంటే ఆయనంత గన్ షాట్ గా అని అని అర్థం. త్రివిక్రం సంచులకొద్ది వేసే పంచులకంటే పూరీ రాసే బుల్లెట్ లాంటి డైలాగ్స్ కే పవరెక్కువ. ఈ విషయంలో పూరి లోని డైరెక్టర్ ని రైటర్ తొక్కేసి చంపేస్తాడు. అయినా పూకి అదే ఇష్టం. పూరిలో డైరెక్టర్ కంటే డైలాగ్ రైటరే ఎక్కువగా డామినేట్ చేస్తాడని పూరినే స్వయంగా చాలా సందర్భాలలో చెప్పారు.

 

ఇక పూరి ఒక హీరోని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినట్టు ఇంకే డైరెక్టర్ ప్రజెంట్ చేయలేరు. ఈ విషయం ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అయినా ఒప్పుకొని తీరాల్సిందే. హీరో బాడీ లాంగ్వేజ్, మానరిజం, మేకోవర్, ఆటిట్యూడ్ ..ఇలా ఏది చూసినా ఆయనలా ఒక హీరోని మాస్ యాంగిల్ లో ఏవరు చూపించలేరు. కనీసం కాపీ కూడా కొట్టలేరన్నది వాస్తవం. ఇక పూరి రాసే డైలాగ్స్ కి ఏ హీరో అయినా తన స్టైల్ మార్చుకోవాల్సిందే. అందుకు ఉదాహరణగా పైసా వసూల్ లో బాలయ్యనే తీసుకోవచ్చు. బాలయ్య లైఫ్ లో అంత ఎనర్జిటిక్ క్యారెక్టర్ అంతకముందెన్నడు చూడలేదంటే మరో మాట మాట మాట్లాడకుండా ఒప్పుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అప్పటి వరకు ఉన్న ఇమేజ్ వేరు. కాని బద్రి సినిమాతో మొత్తం మారిపోయింది. క్లాస్ హీరోగా చూపిస్తూనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో మాస్ ఎలిమెంట్స్ ని బాగా మిక్స్ చేశారు పూరి. నువ్వు నందా అయితే నేను బద్రు బద్రీనాధ్ ..అయితే ఏంటి అన్న డైలాగ్స్ పవన్ కెరీర్ లోనే బెస్ట్ డైలాగ్. 

 

ఇక పోకిరి సినిమాకి ముందు మహేష్ బాబు కి ఉన్న ఇమేజ్ మార్కెట్ మొత్తాన్ని పూరి పోకిరి తో కంప్లీట్ గా మార్చిపారేశారు. ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టిన సినిమాగా మహేష్ కెరీర్ లో పోకిరి ఎప్పటికి మిగిలిపోతుంది. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైంద్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు ..ఈ డైలాగ్ ఒక్కటి మహేష్ స్టామినా ఏంటో నిరూపించింది. ఇలాంటి డైలాగ్స్ పూరొ ప్రతీ హీరో చెప్పించి వాళ్ళ ఇమేజ్ ని మొత్తం మార్చేశారని ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి తెలిసిన సంగతే.  ఇక పూరి హీరో కథ, డైలాగ్స్ మీద ఎంతగా కాంట్రన్‌టేషన్ చూపిస్తారో హీరోయిన్ మీద గాని తన క్యారెక్టర్ మీద గాని అంతే కాంట్రన్‌టేషన్ చూపిస్తారు. మిగతా సినిమాలలో మాదిరిగా హీరోయిన్ ని కేవలం పాటలకోసం మాత్రం అసలు సినిమాలో పెట్టరు. హీరోకి సమానంగా హీరోయిన్ క్యారెక్టర్ ని రాసుకుంటారు. కథలో సినిమాలో హీరోయిన్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. అందుకే పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ కి మంచి స్టార్ డం ఉంటుంది. 

 

అయితే ఇస్మార్ట్ శకర్ తో బ్రేక్ ఇచ్చిన నిధీ అగర్వాల్, ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న కియారా అద్వాని కి పూరి గట్టి షాకిచ్చారు. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమాని తీయబోతునారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని విజయ్ సరసన నటింపచేస్తున్నారు. అయితే వాస్తవంగా ముందు ఫైటర్ లో నిధీ అగర్వాల్ గాని, కియారా అద్వాని గాని తీసుకోవాలనుకున్నారట పూరిల్ ఈ మేరకు ఈ ఇద్దరితో సంప్రదింపులు కూడా జరిగాయట, కానీ ఏమైందో గాని ఇప్పుడు ఆ ఇద్దరికి పూరి ఝలక్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా జాన్వీ కన్‌ఫర్మ్ కాగా మరో హీరోయిన్ కోసం కొత్త అమ్మాయిని వెతుకుతున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: