తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. ముఖ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో, ఢీ ద్వారా ఎంతో పాపులర్ అయింది ఈ భామ. ఇక తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు చిన్న పిల్లల మీద లైంగిక దాడులను ఖండించడంలోనూ, ఇతరత్రా మహిళా హక్కుల విషయంలో కూడా రష్మీ గౌతమ్ ఎప్పుడూ ప్రశ్నించడానికి ముందుంటుంది. ఇదిలా ఉంటే ‘అదిరింది’ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్గా సమీరా షరీఫ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
సమీరా షరీఫ్ 'ఆడపిల్ల' సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ సీరియల్ సూపర్ హిట్ తర్వాత..ఆమె తెలుగులో ఎన్నో సీరియల్స్ చేసి పాపులర్ అయింది. నటిగా నిరూపించుకున్న సమీరా..ఆ తర్వాత నిర్మాతగా మారి తమిళంలో సీరియల్స్ను కూడా నిర్మిస్తోంది. ఇక ఇటీవల జీ తెలుగులో అదిరింది కామెడీ షోకు యాంకరింగ్ చేస్తూ అదరగొడుతోంది. అయితే వీళ్లిద్దరి గురించి ఎందుకు చెబుతున్నానంటే.. వీరిద్దరూ ఓ విషయంలో సేమ్ టు సేమ్గా ఉంటారు. అసలు విషయంలోకి వెళ్తే.. జంతువులన్నా, మూగ జీవాలన్నా రష్మీకి ఎంతో ప్రేమ. ఎప్పటికప్పుడు వాటిని కాపాడాలంటూ సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తూనే ఉంటుంది.
తన ఇంట్లో బంబుల్ అనే కుక్కను కూడా పెంచుకుంటోంది. ఇక ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ కుక్కను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటుంది. ఇలా యానిమల్ లవర్గా కూడా రష్మీ అందరికీ పరిచయమే. సమీరా షరీఫ్ కూడా యానిమల్ లవరే. ఆమెకు కూడా మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. తెరపై నవ్వులు పూయించే సమీరా జంతువులు, మూగ జీవాలంటే ఎంతో ప్రేమ కురిపిస్తుంది. కుక్కలు, పిల్లులంటే ఆమెకు చాలా ఇష్టం. కాగా, ప్రస్తుతం జబర్దస్త్, అదిరింది షోల మధ్య పోటాపోటీ నడుస్తోంది. తెరపై ఈ ఇద్దరు యాంకర్లూ నువ్వా నేనా అనుకుంటున్నా.. తెరవెనక మాత్రం మూగ జీవుల విషయంలో సేమ్ టు సేమ్ అనిపించారు.