వివాదాస్పద నటి శ్రీరెడ్డి హైదరాబాద్ నుంచి చెన్నై కు మకాం మార్చిన విషయం విదితమే. ఆమె అక్కడ ఉన్న కూడా ఇక్కడి విషయాల గురించే ఎక్కువసేపు మాట్లాడుతుంది. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి ఆమె సాంప్రదాయక వస్త్రాలను ధరించి బాగా పూజలు కూడా చేస్తుంది. మొన్న ఆ మధ్య తమిళనాట ఒక ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి.. యువత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తానని చెప్పుకొచ్చింది.


కానీ ఇటీవల చెన్నై లో ప్రశాంతంగా ఉంటున్న శ్రీరెడ్డిని గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రజలు తెగ టార్చెర్ పెడుతున్నారట. దానికి అసలు కారణం మిల్కీ బ్యూటీ తమన్నానే అట. ఎందుకంటే శ్రీరెడ్డి ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే ఒక మాజీ కమీషనర్ ఇల్లు ఉందట. అందులో తమన్నా కి సంబంచిందిన ఒక వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. అయితే షూటింగ్ ని వీక్షించడానికి వచ్చిన తమన్నా అభిమానులు అంతా శ్రీ రెడ్డి ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఆమె చెప్పిన ప్రకారం, తనపై కామెంట్లు కూడా చేస్తున్నారట. తన కారుపై గీతాలు కూడా గీసారట. 'నా కులం, మతం పేరు పెట్టి తిడుతున్నారు.. నేను మీ మతానికి గౌరవం ఇచ్చినప్పుడు మీరు కూడా నా మతాన్ని గౌరవించాలి. అసలు బయటకు వెళ్లే పరిస్థితి లేదే. నన్ను ఇల్లుమార్చుకోమంటారా? నేను నా ఫోన్ నెంబరే మార్చలేదు. అలాంటప్పుడు ఇల్లు ఎలా మారుస్తా. ఒక్కరోజైతే ఇంటి ముందు కూర్చోవచ్చు ప్రతిరోజూ కూర్చుంటే ఎలా', అంటూ ఆమె వాళ్లపై మండిపడుతుంది.


'రోజువారీ పనులు చేసుకోకుండా ఇళ్ళమీద పడి ఒకటే కామెంట్లు చేస్తున్నారేరా మీ దుంపతెగ.. నేను భవానీ మాలలో ఉన్నాను కాబట్టి ఎవ్వరినీ ఏమీ అనలేకపోతున్నాను. లేకపోతే నా.. ఒక్కోకిడికి..', అంటూ ఆమె అన్నారు. పోలీసులకు కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని ఆమె అన్నారు. తమన్నా అయితే ఏంటీ, చిరంజీవి అయితే ఏంటీ.. మీ షూటింగులు ప్రశాంతంగా జరగాలని మిగతావాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్టు అని ఆమె ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: