నిత్యామీనన్ ఎంత మటి హీరోయిన్ అన్న విషయం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన సినిమాలు ఒకటి రెండు తెలుగులో వస్తూనే ఉంటాయి. కాకపోతే ఆమె రీసెంట్ గా చేసిన తెలుగు స్ట్రయిట్ మూవీ ఏంటని అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం కాస్త ఎవరికైనా కష్టమేనని చెప్పాలి. అలా టాలీవుడ్ కు నిత్యా మెల్లమెల్లగా దూరమైపోతోంది. అప్పుడెప్పుడో జనతా గ్యారేజ్ లో సెకెండ్ హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత గీతగోవిందంలో గెస్ట్ రోల్ చేసింది. అంతే ఆ తర్వాత మళ్లీ నిత్యా నేరుగా తెలుగులో సినిమా చేసిందే లేదు. మళ్లీ ఇన్నాళ్లకు మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది ఈ మల్లూ బ్యూటీ అని లేటెస్ న్యూస్.

 

స్కై లాబ్ అనే వర్కింగ్ టైటిల్ తో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. టైటిల్ చూసి ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకోకండి పొరపాటున కూడా. 1979లో కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ సినిమా గా రూపొందనుందని తాజా సమారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది నిత్యామీనన్. కొత్త ఏడాదిలో జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సత్యదేవ్ ఆల్మోస్ట్ సెకండ్ హీరో పాత్రలో కనిపించాడు.

 

అమెరికా నెలకొల్పిన అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ కూలిపోతుందంటూ 1979లో ప్రపంచవ్యాప్తంగా పుకార్లు వచ్చాయి. అది కూలితే భూమిలో సగభాగం అంతరించిపోతుందని చాలామంది అప్పట్లో పుకార్లు పుట్టించారు. ఇక ఇవే ఆఖరి క్షణాలంటూ చాలామంది అప్పట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. మరికొంతమంది తమ భూములు, ఇళ్లు కూడా అమ్ముకున్నారు.

 

అలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ లో కొన్ని కుటుంబాల మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలొచ్చాయి, తిరిగి వారు ఎలా కలిశారు.. లాంటి ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందట. సినిమా కథ మొత్తం నిత్యామీనన్ చుట్టూ తిరుగుతుందట. కాబట్టే నిత్యాసినిమా ఒప్పుకోవడానికి అసలు కారణం అని తెలుస్తోంది. పలు షార్ట్ ఫిలిమ్స్ తీసిన విశ్వక్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన కే.ఎఫ్.సి ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. మొత్తానికి నిత్యా ఎవరూ ఊహించని పాత్రలో కనిపించి షాకివ్వబోతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: