సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు హిట్ అయ్యాయంటే వరుసగా అన్ని సినిమాల్లోనూ ఆమే కనిపిస్తుంది. అదే ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే ఆమెకి అవకాశం ఇవ్వాలంటేనే భయపడుతుంటారు. సినిమాల్లో టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ప్రస్తుతం ఇలాంటి ఒక సెంటిమెంట్ ని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్రేజక్ చేశాడు.

 

 

సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగే సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సాయి గత చిత్రమైన చిత్రలహరి కూడా మంచి విజయం సాధించింది. అంతకుముందు సాయి చేసిన ఆరు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. అయితే ఈ ఆరు చిత్రాల్లో నాలుగు చిత్రాలకి సంగీతం అందించింది థమనే. ఒక సినిమా డిజాస్టర్ అయ్యిందంటేనే మరో సినిమాకి అవకాశం ఇవ్వలా వద్దా అని ఆలోచిస్తారు.

 

 


కానీ థమన్ ని మాత్రం సాయి తేజ్ మార్చకపోవడం గమనార్హం. కానీ నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాక తమన్‌ని తీసుకోవాలంటేనే భయపడ్డారట. కానీ మారుతికి తమన్‌ బాగా ట్యూన్‌ అవడంతో ప్రతిరోజూ పండగేకి అతనే పాటలు చేసాడు. మారుతి సినిమా అయిన మహానుభావుడు కి థమనే సంగీతం అందించాడు. ఈ సినిమాలో మ్యూజిక్ కి మంచి పేరొచ్చింది. దాంతో ప్రతి రోజూ పండగేకి కూడా థమనే సంగీతం అందించాడు.

 

అయితే ప్రతి రోజూ పండగే హిట్ అవడంతో వీరిద్దరి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. అందువల్ల సాయి ధరమ్ తేజ్ తన తర్వాతి రెండు చిత్రాలకి కూడా థమన్ నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు. తన తర్వాతి చిత్రమైన సోలో బ్రతుకే సొ బెటరు చిత్రానికి మరియు దేవకట్టాతో చేసిన చిత్రానికి కూడా థమనే సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: