తమిళనాడు లో ఓ నటి మాజీ ప్రియుడు వేధిస్తున్నారని అతనిని చంపేసింది..వివరాల్లోకి వెళితే..
వివాహం అయిన బుల్లితెర నటిని అక్రమ సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసిన ఆమె మాజీ ప్రియుడు దారుణంగా హత్యకు గురైనాడు. మాజీ ప్రియుడి హత్య కేసులో బుల్లితెర నటితో పాటు ఆమె భర్త, చెల్లెలు, ఆమె భర్తను తమిళనాడు రాజధాని చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కొనసాగించాలని తనతో పాటు తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చెయ్యడం వలనే తాము హత్య చెయ్యవలసి వచ్చిందని బుల్లితెర నటి చెబుతోందని చెన్నై సిటీ పోలీసులు అంటున్నారు.


రవి అనే వ్యక్తి సినిమాలలో నటించడానికి వచ్చాడు.. ఈ క్రమంలో దేవితో పరిచయం ఏర్పడింది..అలా అక్రమ సంబంధంగా మారింది..అలా కొంతకాలం తిరిగారు.. దేవి భర్త శంకర్ వార్నింగ్ ఇవ్వడం తో దేవి అతనిని ఎలాగైనా వదిలించుకోవాలని కోరికతో మొత్తానికి మకాం మార్చేసింది. భర్త శంకర్ తో కలిసి వడపళనిలోని ఇల్లు ఖాళీ చేసి కొలత్తూర్ సెమాత్తమన్ కోవిల్ వీధిలోని కొత్త ఇంటికి మారిపోయింది. తరువాత దేవి ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ మార్చివేసి రవికి కనపడకుండా, అతనికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరిగింది.


తన ప్రియురాలు దేవి కోసం ఎక్కడెక్కడో గాలించిన రవికి చివరికి ఆమె చెల్లెలు లక్ష్మి ఇంటి అడ్రస్ చిక్కింది. ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన రవి మాజీ ప్రియురాలు దేవి చెల్లెలు లక్ష్మి ఇంటికి వెళ్లి మీ అక్క అడ్రస్ చెప్పాలని, కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. దేవి ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ తనకు తెలీదని లక్ష్మి రవికి చెప్పింది. అయితే మాట వినని రవి నువ్వు మీ అక్క దేవి అడ్రస్ చెప్పకుంటే ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తేలేదని అక్కడే మకాం వేశాడు.

 

అది ఆమె చెల్లి ద్వారా అడ్రెస్స్ తెలుసుకున్న రవి ఆ ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు.. అతని గొడవ ఎక్కువ కావడంతో ఇనుప రాడ్డుతో తలమీద కొట్టింది.. భర్త కూడ కర్రతో బలంగా కొట్టాడు..దేవి చెల్లి భర్త కూడా అతనిని చంపడంలో సహకరించారని అర్థమవుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: