ప్ర‌స్తుతం సంక్రాంతి బ‌రిలో నాలుగు చిత్రాలు పోటీప‌డ‌గా అందులో ఎక్కువ‌గా హైప్ ఉన్న చిత్రాలు రెండు. ఒక‌టి అల్లుఅర్జున్ న‌టించిన `అల‌వైకుంఠ‌పురంలో` ఇంకొక‌టి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన `స‌రిలేరునీకెవ్వ‌రు` ఇవి రెండు కూడా క్రేజ్ ఉన్న మూవీస్ అని చెప్పాలి. అయితే ఇందులో అన్నిటికంటే ముందు ఎక్కువ రేంజ్ సంపాదించిన చిత్రం మాత్రం అల‌వైకుంఠ‌పురంలో చిత్ర‌మే. ఈ చిత్రానికి సగం ప‌బ్లిసిటీ థ‌మ‌న్ సంగీతంతోనే వ‌చ్చింది. తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా సౌత్ ఇండియా ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అలా వైకుంఠపురంలో చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారట. అయితే ఈ నెల 6 న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకోనుంది.

 


అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఒక స్టేజి పైనే కనిపిస్తే మెగా, పవర్ అభిమానులకు పండగే. అయితే ఈ చిత్ర వేడుకకి పవన్ తప్పకుండా వస్తారని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని జనవరి 10 న విడుదల చేసేందుకు పట్టుబట్టారని ఫిలిం నగర్ లో వార్త చెక్కర్లు కొడుతుంది. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించక పోగా, తాజాగా విడుదల చేసిన నూతన సంవత్సర పోస్టర్ లో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. అయితే ఆ పుకారే నిజం కానుంది అని తెలుస్తుంది.


ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ సారి సంక్రాంతికి ఈ రెండు చిత్రాలు మాత్రం కాస్త గ‌ట్టి పోటీగానే నిలిచేట‌ట్టు ఉన్నాయి. ఇక పోటీ సంగ‌తి అటుంచితే టాలీవుడ్ ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం ఈ సారి అనిల్‌రావిపూడి హిట్ కొడ‌తాడా అనే అనుమానాలు ఎందుకో గాని కాస్త గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. మ‌హేష్‌బాబు కొత్త గెట‌ప్‌లో కనిపించిన‌ప్ప‌టికీ దేవిశ్రీ‌మ్యూజిక్ మాత్రం మొత్తం చెడ‌గొట్టేశాడు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన చిన్న చిన్న సాంగ్ బిట్స్ చూస్తుంటే మ‌హేష్‌, ర‌ష్మిక‌ల కెమిస్ట్రీ కూడా పెద్ద‌గా ఎట్రాక్ట్ చేయ‌డంలేదు. ఇక అల విషయానికి వ‌స్తే సినిమా ఎలా ఉన్నా కూడా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఆడియో ట్రైల‌ర్ జ‌నాల‌ను బాగా ఆక‌ర్షించాయ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: