ఎన్టీఆర్.. ఈ పేరుకు కొన్ని కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఇతనికి ఒక సైన్యం ఉంది. తాత సీనియర్ ఎన్టీఆర్ ను మించిన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఎన్టీఆర్. అలాంటి ఈ ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఈ లుక్ చుస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్ కు ఏమైంది అనే సందేహం వచ్చేస్తుంది. అసలు ఎన్టీఆర్ కు ఏమైంది అంటే... 

 

వివరాల్లోకి వెళ్తే... నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఇంటివద్దకు వచ్చారు. ఒకరు ఇద్దరు కాదు కొన్ని వందలమంది అయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేందుకు అతని ఇంటి వద్దకు వచ్చారు. దీంతో ఆ అభిమానులు అందరిని పలకరించేందుకు తన ఇంటి మేడపైకి వచ్చారు. అందరికి అభివాదం చేసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

 

ఆ సమయంలోనే ఎన్టీఆర్ తీశారు తన అభిమానులు. ఆ ఫొటోలను కాస్త సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలు చుసిన అభిమానులు ఎన్టీఆర్ కి ఏమైంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కొత్త సినిమాలో పాత్ర కోసం ఆలా చేస్తున్నారా ? లేక ఎన్టీఆర్ కి ఏమైంది అనే సందేహం తన అభిమానులలో కనిపిస్తుంది. 

 

కాగా ఎన్టీఆర్ 'అరవింద సమేత' సూపర్ హిట్‌ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తున్న సంగతి విదితమే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్‌ చరణ్‌ మరో కథానాయకుడుగా మల్టీస్టార్ గా సినిమా రూపొందుతుంది. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలుగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారు. మరి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల రెండేళ్ల కష్టం ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: