టాలీవుడ్ యంగ్ హీరో వరుస వైఫల్యాలతో తీవ్ర నిరాశకి గురయ్యాడు. ఇటీవల ఆయన నటించిన ఇద్దరి లోకం ఒకటే చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా డిప్రెషన్ కి లోనయ్యాడట. ఎందుకంతే ఇప్పటికే రాజ్ తరుణ్ కెరీర్లో వరుసగా ఆరవ ప్లాప్ సినిమా ఇది. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ విజయం మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటిది వరుసగా ఆరు ఫ్లాపులు ఎదురయ్యాయంటే ఇక హీరో కెరీర్ కొనసాగించాలంటే కష్టమే..

 

అయితే దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా అభిమానులకి నచ్చుతుందని ఖచ్చితంగా విజయం సాధిస్తానని అనుకున్నాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకి ఎక్కలేదు. బోరింగ్ గా సాగే లవ్ స్టోరీ కాబట్టి దాన్ని తిప్పి కొట్టారు. దాంతో నిరాశలోకి వెళ్ళిపోయిన రాజ్ తరుణ్ తన తర్వాతి చిత్రమైన డ్రీమ్ గర్ల్ సినిమాని చేయాలా వద్దా అన్న సంధిగ్ధంలో పడిపోయాడట.

 

ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ హిందీలో బిగ్ హిట్. పూర్తిగా ప్రయోగాత్మక కంటెంట్ ఉన్న చిత్రమిది. తెలుగు వెర్షన్ ని రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కించేందుకు డి.సురేష్ బాబు ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే యువహీరోపై ట్రయల్ షూట్ చేశారు. తెలుగు వెర్షన్ స్క్రిప్టు సహా క్యారెక్టర్ డిజైన్ పూర్తయింది. షెడ్యూల్స్ ని రెడీ చేశారు. కానీ రాజ్ తరుణ్ ఉన్నట్టుండి సందిగ్ధంలో పడ్డాడట. ఇప్పడున్న డైలమాలో మరో ప్రయోగం చేయాలంటే కాస్త టెన్షన్ పడుతున్నాడట.

 

డ్రీమ్ గర్ల్ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆయుష్మాన్ ఖురానా నటనకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. అదీ గాక రాజ్ తరుణ్ లాంటి హీరోకి పక్కాగా సూటయ్యే క్యారెక్టర్ ఇది. మరి నిరాశలో కూరుకుపోయిన రాజ్ తరుణ్ ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటాడా..? లేదా సినిమా చేసి తనని తాను నిరూపించుకుంటాడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: