విక్టరీ వెంకటేష్ వెంకీ మామా చిత్రంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ చైతన్య మరియు వెంకీలు కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళు సాధించింది. ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ గా నిలిచింది వెంకీ కామెడీనే. కామెడీని పండించడంలో వెంకీని మించిన వాళ్ళెవరూ లేరనే విధంగా అద్భుతంగా నవ్వించి బాక్సాఫీసును కొల్లగొట్టాడు. 2019 లో వెంకీ ఖాతాలో ఇది రెండవ హిట్.

 

2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 కూడ ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. వెంకీ కమ్ బ్యాక్ కావడానికి ఈ చిత్రం ఎంతగానో తోడ్పడింది. సీనియర్ హీరో అయిన వెంకటేష్ మార్కెట్ ని మరింత పెంచిన చిత్రమిది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిక్వెల్ పనులు చక చకా జరుగుతున్నాయట. ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం అప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు కూడా.

 

అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ కి సంబంధించి కొన్ని స్క్రిప్ట్స్ వినిపించారని, వాటిలో ఏ కథను సీక్వెల్ చేయాలో ఇంకా ఫైనల్ చేయలేదని అంటున్న వెంకీ అందులో లీడ్ రోల్స్ లో తాను, వరుణ్ చేస్తామని, హీరోయిన్లను కూడా ఫైనల్ చేయాల్సి ఉందని అన్నారు. ఎఫ్ 2 లో నటించిన వీరే దాని సిక్వెల్ లోనూ నటిస్తుండడం సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.

 

 

అయితే  ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘సరిలేర నీకెవ్వరు’ విడుదల సన్నాహల్లో ఉండగా వెంకీ ‘అసురన్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే వరుణ్ ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు. వీరందరి ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి కాగానే ఈ సీక్వెల్ మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి ఆ తర్వత అప్డేట్ ఇస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: