పూరీ జగన్నాథ్ దర్శకుడుగా రీ బౌన్స్ కావడం వెనుక ‘ఇస్మార్ట్ శంకర్’ నిర్మాణ సమయంలో ఛార్మీ పూరీ వెనుక ఉండి అన్నీ తానై వ్యవహరించిన తీరు తెలిసిందే. విజయ్ దేవరకొండ పూరీ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి ఛార్మీ రాయబారాలు బాగా ఫలించడంతో ఆమె బిజినెస్ తెలివితేటలను చూసి బాలీవుడ్ ఏక్తా కపూర్ తో ఛార్మీని పోలుస్తున్నారు.

దీనితో రోజురోజుకు పెరిగిపోతున్న పూరీ ఛార్మీల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అయితే కేవలం తమ ఇద్దరిది బిజినెస్ బంధం మాత్రమే అంటూ అనేకసార్లు వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం మేరకు పూరీ కొడుకు ఆకాష్ నటిస్తున్న ‘రొమాంటిక్’ మూవీలో ఆకాష్ తల్లి పాత్ర కోసం మొదట్లో పూరీ ఛార్మీలు మందిరా బేడీని ఎంపిక చేసినట్లు టాక్. 

అయితే ఈ సినిమాలో మందిరా బేడీ ఆకాష్ తల్లిగా నటించిన సీన్స్ పూరీ జగన్నాథ్ కు ఏమాత్రం నచ్చకపోవడంతో ఆమె స్థానంలో రమ్యకృష్ణను ఆకాష్ తల్లిగా మార్చి ఈ మూవీలోని సీన్స్ చాలామటుకు రీ షూట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ అనిల్ పడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీకి పూరి జగన్నాథ్ ఛార్మీలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

వాస్తవానికి హాట్ బ్యూటీగా పేరు గాంచిన మందిరా బేడీని ఆకాష్ తల్లిగా ఎంపిక చేయడం మొదటి నుంచి పూరీకి ఇష్టం లేకపోయినా ఈ మూవీ దర్శకుడు అనీల్ పడూరి ఛార్మీ సలహాలతో మందిర ఆకాష్ తల్లిగా ఎంటర్ అయింది అన్న వార్తలు ఉన్నాయి. అయితే మందిర పాత్రలో పూరీకి ఆమెలో సహజంగా ఉండే గ్లామర్ ఎక్కువగా కనిపించడంతో ఆమెను తప్పించి రమ్యకృష్ణ ను ఆకాష్ తల్లిగా మార్చడంతో పూరీకి అనవసరంగా ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ పెరిగింది అంటారు. ఇప్పటికే ఆకాష్ తో సినిమా తీసి ఆర్ధికంగా నష్టపోయిన పూరి మళ్ళీ కొడుకుని హీరోగా చేయడానికి ఈ సినిమా విషయంలో కూడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: