సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆ అంచనాలను డబుల్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు, 

 

దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో వైభవంగా జరుగనుంది. కాగా ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విచ్చేస్తున్నారు. అతి పెద్ద మెగాసూపెర్ ఈవెంట్ గా సరిలేరు నిర్మాతలు దీనిని ప్లాన్ చేస్తున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి ఈనెల 9న మరొక ఈవెంట్ నిర్వహించనుందట సరిలేరు యూనిట్.

 

ఇప్పటివరకు ప్రతి సినిమాకు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం మనం చూసాం. 
సినిమా కోసం రెండవ యూనిట్ ప్లాన్ చేస్తున్న యూనిట్, దానిని కూడా ఎంతో గొప్పగా నిర్వహించనుందట. ఆ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. గత ఏడాది మహేష్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ విచ్చేసిన విషయం తెల్సిందే. కాగా మరొక్కసారి ఎన్టీఆర్ ని ఈ సినిమా సెకండ్ ఈవెంట్ కి ఆహ్వానిస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులు యోచన చేస్తున్నారట. కాగా ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: