గత ఏడాది
కోలీవుడ్ లో సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన చిత్రం అసురన్. నేషనల్ అవార్డు
విన్నర్ వెట్రి మారన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో
తమిళ హీరో ధనుష్ , మలయాళ నటి మంజూ
వారియర్ లీడ్ రోల్ లో నటించారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల ను రాబట్టింది.
ఇక ఈచిత్రాన్ని ఇప్పుడు తెలుగులో
విక్టరీ వెంకటేష్
హీరో గా రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం
జనవరి 22 నుండి సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. కాగా ఈ
రీమేక్ ను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్
శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటివరకు క్లాసికల్ సినిమాలను తీసిన
శ్రీకాంత్ అడ్డాల మొదటి సారి పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ను డీల్ చేయనుండడం తో ఈ
రీమేక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన కలై
పులి ఎస్ తాను తో కలిసి
సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రానికి
మణిశర్మ సంగీతం అందించనున్నాడు.
ఇక ఈచిత్రంలో శ్రీయ శరన్
హీరోయిన్ గా నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆపాత్ర కోసం
ప్రియమణి ని తీసుకున్నారు. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ వెబ్ సిరీస్ లో నటించిన మెప్పించిన
ప్రియమణి ప్రస్తుతం
రానా, సాయి పల్లవి నటిస్తున్న విరాట పర్వం లో కీలక పాత్రలో నటిస్తుంది. ఈచిత్రం తోపాటు ఆమె కోలీవుడ్ లో
జయలలిత బయోపిక్, తలైవిలో శశికళ పాత్రలో నటించనుంది. ఈచిత్రంలో
కంగనా రనౌత్ ,
జయలలిత పాత్రలో కనిపించనుంది.