కొత్త సంవత్సరం మొట్టమొదటి ఘడియలను టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సరికొత్తగా జరుపుకున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న యువత బైకులపై రచ్చ రచ్చ చేస్తూ రోడ్లపై రాబోయే ఏడాదికి స్పీడ్ పెంచుతూ బైక్ రైడ్ చేస్తూ కొత్త యేడాదిలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో ఉన్న పెద్దలు అయితే గుళ్లు గోపురాలకు వెళ్లి భగవంతుని సన్నిధానంలో న్యూ ఇయర్ లో అడుగు పెట్టడం జరిగింది. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు టాప్ హీరోలు అయితే తమ కుటుంబ సభ్యులతో ఇతర దేశాలలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న సంక్రాంతికి రాబోతున్న మహేష్ మరియు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో ఇతర దేశాల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది.

 

మహేష్ బాబు అయితే తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ టూర్ వెళ్లి కూతురు సితార తో కలిసి డ్యాన్స్ చేస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ నమ్రతా శిరోద్కర్ కుటుంబ సభ్యులతో అందరితో దుబాయ్ లో బాగా ఎంజాయ్ చేసి ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే కుటుంబ సభ్యులతో బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భార్య స్నేహారెడ్డితో కలిసి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

 

మరియు అదే విధంగా నటుడు సుధీర్ బాబు కూడా తన భార్యతో కలిసి వేరే దేశంలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనుష్క శెట్టి మరియు సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సంవత్సర వేడుకలను సరికొత్తగా జరుపుకొని అందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. మొత్తంమీద కొత్త ఏడాదిలో టాలీవుడ్ సెలబ్రెటీలు అదరగొట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: