ఇప్పటికే గత కొద్ది రోజులుగా టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొద్దిపాటి వివాదాలు జరుగుతున్నాయి. మా అధ్యక్షుడి ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య బయటపడ్డ విబేధాలు అందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత అధ్యక్షుడిగా నరేష్ ఎన్నిక ఆయిన తరువాత, నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు ఆయనకు చెప్పకుండా అప్పట్లో మిగతా సభ్యులతో కలిసి మీటింగ్ పెట్టిన విషయం కూడా వివాదాస్పదంగా మారింది. ఇకపోతే నేడు మా డైరీ ఆవిష్కరణ సభలో ఈ విబేధాలు బహిరంగంగా బయటపడ్డాయి. 

 

అది కూడా మెగాస్టార్, రెబల్ స్టార్, టి సుబ్బిరామిరెడ్డి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి వారి సమక్షంలో జరగడం నిజంగా ఎంతో ఆశ్చర్యకరం అనే చెప్పాలి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, ముందుగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్ మధ్యలో పదే పదే అడ్డుపడుతుండగా చిరంజీవి కొంత అసహనం వ్యక్తం చేసారు. అయితే ఆ తరువాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో స్టేజ్ పైకి వచ్చి ఆయన నుండి మైక్ లాక్కున్న రాజశేఖర్, స్టేజ్ పైన ఉన్న వారందరి కాళ్ళకు మ్రొక్కుతూ, ఇక్కడ నిప్పు రాజుకుంది, అంతేకాదు అందరి మధ్య గొడవలు ఉన్నాయి, అయితే అదేమిలేదని కప్పిపుచ్చుతున్నారని అన్నారు. నిజానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వల్లనే కొద్దిరోజలుగా తన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. 

 

అంతేకాదు ఇటీవల తనకు కారు ప్రమాదానికి కారణం కూడా ఆ గొడవలే అని రాజశేఖర్ అందడంతో స్టేజ్ పైన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక కాసేపటికి రాజశేఖర్ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. అనంతరం మాట్లాడిన చిరంజీవి, రాజశేఖర్ గారు మాట్లాడిన విధానం సరైనది కాదని, ఆ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, నిజానికి ఏదైనా మంచి ఉంటె అందరిముందు చెప్పాలి, అలానే చెడు ఉంటె చెవిలో చెప్పాలని తాను ఎన్నో సార్లు చెప్పానని, అయినప్పటికీ రాజశేఖర్ గారు ఈ విధంగా మాట్లాడడం ఎంత వరకు సబబని చిరంజీవి అన్నారు. కాగా ఈ వివాదం విషయం ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: