టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నటప్రపూర్ణ మోహన్ బాబు, ఇద్దరూ కూడా ఎంతో గొప్ప నటులు మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తులు అనే విషయం తెలిసిందే. కెరీర్ పరంగా పలు విజయవంతమైన సినిమాలతో పాటు పలు అవార్డులు కూడా ఇద్దరూ అందుకున్నారు. అయితే కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య కొద్దిపాటి వివాదాలు ఉన్నట్లుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కానీ, తామిద్దరి మధ్య అటువంటిది ఏమి లేదని, మోహన్ బాబు గారు ఏది ఉన్నా కుండ బద్దలు కొట్టినట్లు నిర్మొహమాటంగా మాట్లాడుతారని, 

 

అందువల్లనే ఆయన కొంత కోపిష్టని అందరూ అనుకుంటారు, అలానే నాకు మోహన్ బాబు కు మధ్య ఏవో గొడవలు ఉన్నట్లు ప్రచారం అవుతుంటాయని, అయితే అసలు అటువంటిది ఏమి లేదని పలు మార్లు మెగాస్టార్ కూడా స్పష్టం చేసారు. ఇకపోతే నేడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారి డైరీ ఆవిష్కరణ సందర్భంగా మోహన్ బాబు, చిరంజీవిని గురించి మాట్లాడడం జరిగింది. తనకు చిరంజీవితో ఎప్పటినుండి మంచి అనుబంధం ఉందని, ఆయన భార్య సురేఖ, తనకు సోదరి వంటిదని, ఎప్పుడు ఇంటికి వెళ్లినా ఎంతో సాదరంగా ఆహ్వానిస్తుందని అన్నారు. 

 

ఇక చిరంజీవితో కూడా ఎప్పుడూ తనకు మంచి సామరస్యమే ఉందని, అయితే మీడియా మాత్రం తప్పుగా మా మధ్య ఏదో ఉందని రాస్తోందని, కాగా అవన్నీ తాను ఎప్పుడూ పట్టించుకోనని అన్నారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతున్న సమయంలో, మధ్యలో ఒక్కసారిగా లేచి వచ్చిన మెగాస్టార్, మోహన్ బాబును కౌగిలించుకుని ముద్దులు పెట్టారు. దానితో ఒక్కసారిగా సభా ప్రాంగణం మొత్తం అరుపులు, ఈలలతో మారుమ్రోగింది. మొదటి నుండి టామ్ అండ్ జెర్రీ అనే పేరున్న వీరిద్దరూ ఇలా కలిసి మెలసి సంతోషంగా వ్యవహరించిన ఈ ఘటన ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: