అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా "అలా వైకుంఠపురములో".....ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.. జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్‌ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే, చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు... ఈప్పటికే సినిమాలోని పాటలు శ్రోతల్ని ఉర్రుతలూగిస్తున్నాయి..

 

సినిమా సంక్రాంతి కానుకగా మన ముందుకి రాబోతుంది.. అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రచారం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల ఓ ప్రకటన చేసింది. జనవరి 6న సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు.

 

అలాగే, బన్నీ కూడా డ్యాన్స్ చేయనున్నారని తెలుస్తోంది.బన్నీ డాన్స్ అభిమానులకు ఒక మంచి కిక్ ఇస్తుంది.. కాని ఈ ఫంక్షన్ కి అతిధి ఎవరు రాకపోవడం కొంచెం నిరాశ పరిచే విషయమే.. ఈ ప్రదర్శనని జనవరి 6 న నిర్వహించనున్నట్లు తెలిపారు.. అయితే ఒక రెండు రోజుల తర్వాత ఆంధ్రాలోని ఏదైనా ఓ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే ఆ ఫంక్షన్ కి అతిధి గా మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచారట..

 

మెగాస్టార్ సైరా మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు...అడపాదడపా ఎవరన్నా సినిమా ఫంక్షన్స్ కి పిలిస్తే వెళుతున్నారు.. అయితే అల్లు అర్జున్ మూవీ ఫంక్షన్ కి కూడా విచేస్తున్నారట. ఇప్పటికే చిత్ర బృందం మెగాస్టార్ ని కలిసినట్లు తెలుస్తుంది. చిత్ర బృందం మెగాస్టార్ దగ్గర మాట కూడా తీసుకుందని సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: