మెగా హీరో సాయి తేజ్ నటించిన  లేటెస్ట్ మూవీ  ప్రతి రోజు పండగే ఇటీవల విడుదలై  అద్భుతమైన   వసూళ్లతో   బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది.  కేవలం వారం రోజుల్లోనే  బ్రేక్ ఈవెన్ ను  సాధించడంతో ఈ చిత్రం ప్రస్తుతం   బయ్యర్లను లాభాల్లో ముంచెత్తుతుంది. ఇక నిన్న న్యూ ఇయర్ రోజు ఈ చిత్రం 2.96కోట్ల షేర్ ను రాబట్టి 13వ రోజు  అత్యధిక వసూళ్లను రాబట్టిన  చిత్రంగా   నాన్ బాహుబలి రికార్డు సృష్టించింది.  ముఖ్యంగా ఈ చిత్రం  నైజాం లో అదరగొడుతుంది.  13రోజుల్లో  ఈ చిత్రం అక్కడ 22కోట్ల గ్రాస్ ను అలాగే 10.59కోట్ల షేర్ ను రాబట్టి సాయి తేజ్ కెరీర్ బెస్ట్ మూవీ  గా రికార్డు సృష్టించింది. ఓవరాల్  గా  ఈ చిత్రం 13రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్లషేర్ ను రాబట్టింది.  ప్రస్తుతం  సంక్రాంతి వరకు బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో  ప్రతి రోజు పండగే  ఫుల్ రన్ లో 35కోట్ల షేర్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 
 
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  మారుతి తెరకెక్కించిన   ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సీనియర్ నటులు సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.   గీతా ఆర్ట్స్ 2  బ్యానర్ పై బన్నీ వాస్  నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తో   సాయి తేజ్  వరుసగా రెండో విజయాన్ని  నమోదు చేశాడు. గత ఏడాది  చిత్ర లహరితో  తేజు  వరస పరాజయాలకు బ్రేక్ వేసుకోగా  తాజాగా  ప్రతి రోజు పండగేతో  మొదటి సారి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.  ఇక సాయి తేజ్ ప్రస్తుతం  నూతన దర్శకుడు  సుబ్బు డైరెక్షన్ లో  సోలో బ్రతుకే సో బెటర్ అనే  చిత్రంలో నటిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: