నందమూరి బాలయ్యకు రాజకీయ భవిష్యత్తు అసలు కలిసి రాలేదు. కనీసం సినీమాల్లోనైనా నెగ్గుకు వద్దామని అనుకుంటే వరుసగా ఫ్లాపులమీద ఫ్లాపులు. ఇలాగైతే సినీ రంగంలో తన భవిష్యత్తు ఏంటనే బెంగపట్టుకుంది కావచ్చనుకుంటున్నారు ఇప్పుడు బాలయ్యను చూసిన వారు. ఒక వైపు తన వయస్సుకు దరిదాపుల్లో ఉన్న హీరోలు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీసులు కొల్లగొడుతుంటే తాను మాత్రం తనతో సినిమాలు తీస్తున్న ప్రోడ్యూసర్ల జేబులకు తూట్లు పొడుస్తున్నాను అని మనసులో ఎన్నడు రాని ఆలోచన వచ్చినట్లుగా ఉందికావచ్చు మన బాలయ్య బాబుకి.

 

 

ఎందుకంటే సరికొత్త లుక్‌తో ట్రై చేసిన రూలర్ కూడా కలెక్షన్స్ బ్రేక్ చేయలేక రోట్లోని పచ్చడిలాగా ప్రేక్షకుల మెదళ్లు పచ్చడి చేసిందనే టాక్ ఉంది. ఇక ఇప్పుడు మరొక సినిమా సాహసం చేసి చేస్తే అది కూడా ఇలాంటి పరిస్దితిని తెచ్చుకుంటే తన పరిస్దితి ఏంటనేది ఇప్పుడు బాలయ్య బాబు ముందున్న ప్రశ్న అని అనుకుంటున్నారట. ఇలాంటి పరిస్దితుల్లో బాలయ్యకు ఇప్పుడు హిట్ అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకే బాలయ్య తనకు సూపర్ హిట్ సినిమాలు అందించిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి తన తాజా చిత్రాన్ని ప్రారంభించారని తెలుస్తుంది.

 

 

ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సరిసమానంగా ఓ లేడీ పాత్ర కూడా ఉంటుందని, అయితే అది విలన్ పాత్ర కావచ్చనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుందట. అయితే ఈ పాత్ర కోసం ముందుగా రోజాను దర్శకుడు బోయపాటి సంప్రదించగా ఆమె బాలయ్యతో సినిమాకు ససేమిరా అందట.దీంతో సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్న లేడీ అమితాబ్ విజయశాంతితో ఈ పాత్ర చేయించాలని పట్టుబట్టాడట బోయపాటి.

 

 

ఇందుకు గాను విజయశాంతిని  ఆ పాత్ర కోసం ఎలాగైనా ఒప్పించాలని మరో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి విజయశాంతికి తన కథలోని పాత్రను వివరించాడట. అయితే విజయశాంతి బోయపాటికి ఔనని కానీ, కాదని గానీ చెప్పలేదట. దీంతో బోయపాటి డైలమాలో పడ్డాడట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: