ముద్దుగా మా అని పిలుచుకునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. మాలో విభేదాలు ఉన్నమాట ముమ్మాటికీ వాస్తవం అంటూ రాజశేఖర్ మీడియా సమక్షంలోనే సినీ అతిరధుల ముందే కుండబద్దలు కొట్టేశారు. మొహమాటాలు లేకుండా సినీ నగ్న సత్యాలు ఆవిష్కరించారు. ఆ తరవాత దీనిపై సినీ పెద్దలంతా సీరియస్ కావడం, ఆ తర్వాత మాట్లాడిన జీవిత రాజశేఖర్ బదులు సారీ చెప్పడం చకచకా జరిగిపోయాయి.

 

అయితే.. అసలు ఎందుకు ఉన్నట్టుంది రాజశేఖర్ అంతగా ఫైర్‌ అయ్యారు.. పెద్దలు వారిస్తున్నా మాలో విభేదాలు ఉన్నాయని మీడియా ముఖంగా ప్రకటించారు. అంతర్గంతంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఎందుకు బహిరంగంగా వెల్లడించారు. ఓవైపు చిరంజీవి ముందుగా హెచ్చరిస్తున్నా ఎందుకు రాజశేఖర్ ఆయన మాటలు పట్టించుకోలేదు. ఈ విషయం మీడియా ముందు జరిగితే.. రచ్చ రచ్చ అవుతుందని మా పరువు గంగలో కలుస్తుందని తెలిసినా ఎందుకు రాజశేఖర్ కంట్రోల్ చేసుకోలేక పోయారు.?

 

ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాజశేఖర్ ఆవేశంగా మాట్లాడి వెళ్లిన తర్వాత చిరంజీవి ఆయనపై బాగా ఫైర్ అయ్యారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని మండిపడ్డారు. కావాలనే రాజశేఖర్ తాను ముందుగా హెచ్చరించినా ఖాతరు చేయలేదని అన్నారు. ఇక అలాంటిప్పడు సినీ పెద్దలకు రాజశేఖర్ ఇచ్చిన గౌరవం ఏముందని తీక్షణంగానే ప్రశ్నించారు.

 

ఈ ఘటన అనూహ్యంగా జరిగితే.. చిరంజీవి అంత త్వరగా ప్రీప్లాన్డ్ గా రాజశేఖర్ ఇలా మాట్లాడారని కంక్లూజన్ కు ఎలా వస్తారు.. చిరంజీవి కూడా సంయమనం కోల్పోయి మీడియా ముందు అలా కోప్పడతారు.. అంటే రాజశేఖర్ చెప్పినట్టు ఇదంతా నివురు గప్పిన నిప్పేనా.. రాజశేఖర్ జస్ట్ ఆ నివురును పక్కకు దోసి నిప్పును ప్రపంచానికి చూపించారా.. ఇవీ ఇప్పుడు సినీ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి: