ఇటీవల కొన్నాళ్లుగా కొందరు నటీనటులు మొదట బుల్లితెరపై సందడి చేసి, తమ టాలెంట్ తో మంచి పేరు సంపాదించి, ఆ తరువాత మెల్లగా వెండితెరపై కూడా అవకాశాలతో దూసుకుపోతున్న వారున్నారు. ఇక ఆ విధంగా బుల్లితెరపై కొన్నేళ్ల క్రితం ప్రసారం అయిన నాగిని సీరియల్ ద్వారా మంచి పేరు గడించిన మౌని రాయ్, ఆ సీరియల్ తో ఒక్కసారిగా హిందీ తో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఆ సీరియల్ రెండు భాగాల్లో కూడా నాగిని పాత్రలో నటించిన మౌనికి 2016లో బాలీవుడ్ లో తెరకెక్కిన తుమ్ బిన్ 2 అనే సినిమాలో అవకాశం వచ్చింది. 

 

ఆ తరువాత ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సరసన గోల్డ్ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం లభించింది. మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఆ సినిమాతో మౌనికి ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది. ఆ తరువాత గత ఏడాది ఆమె, మేడ్ ఇన్ చైనా అనే సినిమాలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం మొగుల్, బ్రహ్మాస్త్ర అనే సినిమాల్లో నటిస్తున్న మౌని, 

 

ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు చేరువ అవుతూ ఉంటుంది. ఇకపోతే నూతన సంవత్సరం సందర్భంగా ఆమె నిన్న పోస్ట్ చేసిన ఒక పిక్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. పసుపు రంగు బికినీ వేసుకుని, తన యద అందాలతో దిగిన ఒక సెల్ఫీ ఫోటోని మౌని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ పిక్ చూసిన కుర్రకారు, వావ్ సూపర్, మీరు మరిన్ని సినిమాల్లో హీరోయిన్స్ గా నటిస్తే చూడాలని ఉంది అంటూ ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: