సాధారణంగా మహేష్ చాల తక్కువగా మాట్లాడుతాడు. అతడికి ఎంతో పరిచయం ఉన్న వ్యక్తుల మధ్య తప్ప మహేష్ ఎవరి దగ్గర ఓపెన్ కాడు. అయితే మహేష్ ఒక్కసారి ఓపెన్ అయితే అతడిని పట్టుకోవడం అతడు వేసే జోక్స్ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అని అతడి సన్నిహితులు అంటూ ఉంటారు.

ఇలాంటి పరిస్థితులలో మరొక మూడు రోజులలో రోజులలో జరగబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఎప్పుడు లేని విధంగా ఆ ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేదిక పై నుంచుని ముఖ్య అతిధులను వేదిక పైకి పిలవడం దగ్గర నుండి స్టేజ్ పై నుండి తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే విషయాలను కూడ స్వయంగా మహేష్ డీల్ చేయబోతున్నట్లు టాక్. 

దీనితో నలుగురు మాట్లాడటానికే బిడియపడే మహేష్ ఎల్ బి స్టేడియం లో వేలాది అభిమానుల మధ్య తన కార్యక్రమానికి తనే ఎలా హోస్ట్ గా వ్యవహరిస్తాడు అన్న ఆసక్తి మహేష్ అభిమానులలో పెరిగిపోయింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ పూర్తిగా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడనీ వేదిక పైకి అతిధులను పిలవడం కొద్దిగా తన అభిమానులతో వేదిక పై నుంచి మాట్లాడటం చేసిన తరువాత ఆ కార్యక్రమాన్ని సుమకు అప్పచెపుతాడు అని టాక్.

వాస్తవానికి హీరోలు తమ కార్యక్రమాలకు తామే హోస్ట్ చేసుకునే కల్చర్ హీరో నాని నుండి ప్రారంభం అయింది. నాని వేదిక పై నుండి ఎటువంటి బెదురు లేకుండా చాల సరదాగా మాట్లాడుతాడు. అదేవిధంగా రానాకు కూడ కార్యక్రమాలను హోస్ట్ చేసే సమర్థత ఉంది. ఇక అల్లు శిరీష్ అయితే ఏకంగా ఫిలిం ఫెయిర్ అవార్డ్స్ ఫంక్షన్ కు గతంలో వ్యాఖాతగా వ్యవహరించాడు. దీనితో హీరోలు అంతా కలిసి సుమ స్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ జోక్స్ పేలుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: