భారతీయ సినిమాపై బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ ఎవరూ కలలో కూడా ఊహించని బడ్జెట్ తో, అంతకు మించిన వసూళ్ళతో భారతీయ సినీ ప్రేమికులందరికీ పసందైన విందు ఇచ్చింది. ఇలాంటి సినిమా మళ్ళీ తెర మీద చూస్తామో లేదో అన్నంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందీ ఈ చిత్రం. భారతీయ సినిమా గర్వపడేలా చేసిన చిత్రం బాహుబలి.

 

 

తెలుగు సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారతీయ సినీ పరిశ్రమైలైన అన్ని ప్రాంతీయ భాషల్లోనూ అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రమిది. అయితే ఈ సినిమా వచ్చిన తర్వాత ప్రతీ ఒక్క దర్శకుడు బాహుబలి లాంటి సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నాడు. అంతటి ఇంపాక్ట్ కలిగించే సినిమా కోసం నిత్యమ్ పయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ప్రయత్నంలో భాగమే మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియస్ సెల్వన్.

 

 

 

ప్రముఖ రచయిత కల్కీ కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని `బాహుబలి` తరహాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని  గురువారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఖడ్గాన్ని మాత్రమే వుంచి  ఇంగ్లీష్ అక్షరాల్లో టైటిల్ ని వదిలారు.  

 

 

ఈ సినిమాలో సూపర్ స్టార్లుగా పేరొందిన నటులందరు కనిపిస్తున్నారు. విక్రమ్, ఐశ్వర్యరాయ్, మోహన్ బాబు, త్రిష, యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బాహుబలి లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: