గత కొన్నేళ్లుగా వరుసగా సక్సెస్‌లు అందకుండా సూపర్ స్టార్ మహేష్ బాబును ఊరిస్తున్నాయి. భారి అంచనాలతో సినిమా రిలీజ్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మహేష్ పరిస్దితి ఎలా ఉందంటే ఒక సినిమా సక్సెస్ అయితే.. ఇంకో సినిమా ఫ్లాప్ ఇలా కొనసాగుతుంది. కానీ గతేడాది కొరటాల శివ దర్శకత్వంలో  వచ్చిన ‘భరత్ అను నేను’ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన మహేష్ బాబు ... ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’చిత్రంతో వరుసగా రెండో సక్సెస్ అందుకున్నాడు.

 

 

ఇక ‘భరత్ అను నేను’ సినిమాతో రూ.90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మహేష్.‘మహర్షి’ సినిమాతో రూ.105 కోట్ల షేర్ రాబట్టాడు. ఇక ఈ కొత్త సంవత్సరంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రేస్‌లో నిలిచింది.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇదే కాకుండా ఒకప్పటి లేడీ అమితాబ్.. విజయ శాంతి నటిగా ఈ మూవీతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక మరో విషయం ఏంటంటే మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలకు దాదాపు చిన్న టైటిల్సే ఉన్నాయి..

 

 

ఒక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మాత్రమే మహేష్ కెరీర్‌లో అతిపెద్ద పేరుతో వచ్చిన సినిమా. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ విషయానికొస్తే, ఒకప్పటి ఎన్టీఆర్, హీరోగా నటించిన ‘కంచుకోట’ సినిమాలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ పాట పల్లవిని ఈ సినిమా టైటిల్‌గా పెట్టారు. ఒక పాట పల్లవిని మహేష్ బాబు తన సినిమాకు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అనిచెప్పొచ్చు. ఇదిలా ఉండగా ఈ సంక్రాంతికి బన్నీ అలవైకుంఠపురంలో, సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు బరిలో నిలవగా ‘సరిలేరు నీకెవ్వరు’ విషయాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతుంది.

 

 

ఇకపోతే సెన్సార్ పూర్తైందని చెబుతున్న అందులో క్లారీటి రావడం లేదు ఎందుకంటే ఈ సినిమా రన్ టైం ఎక్కువగా ఉండడం, మిగతా సినిమాలు పోటికి దిగడంతో ఏదో సెన్సార్ జరిగిందని చెబుతున్నారనిపిస్తుంది. ఇప్పుడు అభిమానుల్లో ఈ టాక్ ఒకటే టెన్షన్ పుట్టిస్తుంది. సినిమా అసలు అయిందని అంటున్నారు. కానీ సెకండాఫ్ కూడా సెన్సార్ అయినట్టు టాక్ ఇండస్ట్రీలో బయటకు రావడంతో సినిమా ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: