‘అల వైకుంఠపురములో’ మూవీ పనులలో తెగ బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ హడావిడి మధ్య లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో ఇంత హడావిడి మధ్య త్రివిక్రమ్ పవన్ ను ఎందుకు కలిసాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పవన్ అభిమానుల మధ్య కూడ హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి పవన్ నటించబోతున్న ‘పింక్’ రీమేక్ కు త్రివిక్రమ్ మాటలు రాస్తాడు అంటూ గతంలో వార్తలు వచ్చినా ఆ వార్తలను ఖండించారు. దీనికితోడు పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వివాదాస్పద నిర్ణయం పై జనం మధ్య పోరాటం చేస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ పవన్ ను కలిసింది ‘పింక్’ సినిమాకు సంబంధించింది కాదని అన్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ మూవీ రిలీజ్ డేట్ ను జనవరి 10కి మారుస్తారు అంటూ వార్తలు గుప్పుమంటున్న నేపధ్యంలో ఈ విషయంలో ఆ రిలీజ్ డేట్ మార్పుకు ఏమాత్రం ఆసక్తి కనపరచని త్రివిక్రమ్ పవన్ ద్వారా తన అభిప్రాయాన్ని చిరంజీవికి చేరవేసి మెగా స్టార్ ద్వారా బన్నీ దూకుడుకు కళ్ళెం వేసే ఉద్దేశ్యంతో ఈ కలయిక అని అంటున్నారు. 

అయితే అల్లు అర్జున్ కు పవన్ కు మధ్య సరైన సాన్నిహిత్యం ఇప్పటికీ లేకపోవడంతో ఆ సాన్నిహిత్యాన్ని పెంచడానికి ‘అల వైకుంఠపురములో’ ఫంక్షన్ కు రమ్మని పిలవడానికి త్రివిక్రమ్ పవన్ ను కలిసి ఉంటాడు అని మరికొందరు అంటున్నారు. మరి కొందరైతే దర్శకుడు క్రిష్ ఒక భారీ చారిత్రాత్మక నేపధ్యం ఉన్న సినిమాను పవన్ తో తీయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్న నేపధ్యంలో ఇప్పటికీ ఆ స్క్రిప్ట్ పై పవన్ తన అభిప్రాయం చెప్పక పోవడంతో పవర్ స్టార్ అభిప్రాయాలు తెలుసుకోవడానికి క్రిష్ దూతగా త్రివిక్రమ్ పవన్ దగ్గరకు వెళ్ళాడు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: