సరిలేరు నీకెవ్వరు’ సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ ను బట్టి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ వచ్చిందని ఈ మూవీ నిడివి 2 గంటల 43 నిముషాలు అని అంటున్నారు.

బయటకు వచ్చిన సెన్సార్ టాక్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో 39 నిముషాల ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్ కామెడీ తో ఉంటె సెకండ్ హాఫ్ లో 15 నిముషాల ఎలుక ఎపిసోడ్సినిమా ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుంది అని అంటున్నారు. అలాగే కమెడియన్లు వెన్నెల కిషోర్ సుబ్బరాజులు సెకండాఫ్ లో చేసే కామెడీమూవీ ద్వితీయార్ధంలో వచ్చే విజయశాంతి ఎమోషనల్ సీన్స్ ఈ మూవీకి హైలెట్ అని అంటున్నారు.   

ఇంతవరకు టాలీవుడ్‌లో రాని విధంగా ఇంటర్వెల్ సీన్ ఉంటుందని సమాచారం. సెకండాఫ్‌లో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు ఎమోషనల్ సీన్స్ మాత్రం పీక్స్‌లో ఉంటాయని క్లైమాక్స్ గురించి చెప్పనక్కర్లేదని సెన్సార్ టాక్. అయితే ఈ సినిమాలో ఆర్మీ మేజర్‌గా కనిపిస్తున్నందున మహేష్ బోర్డర్ సీక్వెన్స్‌ కనిపించేది కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అని దీనితో ఆర్మీ యాక్షన్ సీన్స్ పెద్దగా లేవు అన్న టాక్ వినిపిస్తోంది. 

దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన పాటలు పెద్దగా బాగా లేకపోయినా ఆ పాటల చిత్రీకరణ మాత్రం చాల బాగుందనీ దీనితో పాటల ట్యూన్స్ బాగాలేదు అన్న అభిప్రాయం నుండి సగటు ప్రేక్షకుడు బయటకు వస్తాడు అని అంటున్నారు. అనీల్ రావి పూడి చాల తెలివిగా ఈ మూవీ స్క్రీన్ ప్లే ని నడిపిస్తూ ఎక్కడా ఒక్క చోట కూడ బోర్ సన్నివేశం కూడ లేకుండా డిజైన్ చేసాడు అన్న టాక్ వినిపిస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ లీకులు నిజమైతే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: