ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్‌లోనే రెండు పేరొందిన కుటుంబాలకు చెందిన ఈ హీరోలను కలిపిన ఘనత జక్కన్నకే దక్కింది. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లకు జోడీగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ ఆడి పాడనున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ గాని, సినిమా టైటిల్ గాని రిలీజ్ చేయలేదు. ఇప్పటికే సినిమాకు సంబంధించి 70శాతం మేర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సిరీస్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరిలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే  గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్‌తో ఏ.ఆర్.మురుగదాస్ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ.. ఈ సినిమా డ్రాప్‌ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమా వద్దు అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటీ అంటే.. 2022 లో మళ్ళీ రాజమౌళి తో సినిమా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

ఈ లోపు రెండు ప్రాజెక్టులు ఓకే చేసాడు ఎన్టీఆర్‌. దీంతో మురగాదాస్ సినిమాకు మూడు నెలలు మాత్రమే డేట్స్ ఉండ‌డంతో సినిమా డ్రాప్ అయిన‌ట్టు తెలుస్తోది. కాగా, దక్షిణాది చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఏ.ఆర్.మురుగదాస్‌ది ప్రత్యే శైలి అనే చెప్పాలి. డిపరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయడం మురుగదాస్ స్పెషాలిటీ. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘దర్బార్’ సినిమా చేసాడు. మ‌రోవైపు ఎన్టీఆర్ ఇప్ప‌టికే.. అట్లీ, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, కొరటాల శివ సినిమాల కథలకు ఓకే చెప్పాడు. మ‌రి వీరిలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎవ‌రికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: