టాలీవుడ్ లో మెగా హీరోలతో సినిమాలంటే కత్తిమీద సాము అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ మూవీ కథ, నటులు, మ్యూజిక్, ప్రమోషన్స్ అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మద్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ప్రేక్షకాధరణ లభించలేక పోయింది. ఈ మూవీకి ఇప్పటి వరకు మెగాస్టార్ కెరీర్ లో కనీ వినీ ఎరుగని రీతిలో పెట్టుబడి పెట్టారు. తెలుగ, కన్నడ,మళియాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసినప్పటికీ ఫలితం శూన్యం అయ్యింది. దాంతో సురేందర్ రెడ్డి మళ్లీ మెగా హీరోలతో రెడీ అవుతారా అన్న అనుమానాలు వచ్చాయి.
గతంలో అల్లు అర్జున్ తో ‘రేసు గుర్రం’, రామ్ చరణ తో ‘ధృవ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. ఈ ఇద్దరు హీరోలతో మంచి విజయం అందుకున్న సురేందర్ రెడ్డిపై మెగాఫ్యామిలీ కి ఎంతో నమ్మకం పెరిగిపోయింది. దాంతో మెగాస్టార్ తన తదుపరి సినిమాకు ఛాన్సు ఇచ్చాడు. చిరంజీవి చిరకాల కోరిక అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ నేపథ్యంలో ‘సైరా నరసింహారెడ్డి ’ తెరకెక్కించారు. అయితే మెగాస్టార్ విషయంలో మనోడి అంచనాలు తారుమారయ్యాయి.
తాజాగా ఇప్పుడు మరోసారి మెగా హీరోతో ఓ మూవీ తెరకెక్కించబోతున్నారట సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు సురేందర్ రెడ్డి. యాక్షన్ థ్రిల్లర్గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుండగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై రాజీవ్ రెడ్డి ఈ మూవీ నిర్మించనున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అయితే బాగా సెట్ అవుతుందని అభిప్రాయంలో ఉన్నారట.. ఈ మేరక సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు టాలీవుడు సమాచారం.