హీరోయిన్స్‌ అంటే ముద్దుగా, బొద్దుగా ఉండే రోజులు పోయాయి. ఒకప్పటి హీరోయిన్స్ తో ఇప్పటి హీరోయిన్స్ ను పోల్చి చూస్తే. అప్పటి హీరోయిన్స్ కట్టుబొట్టు, నిండారుగా ఉండే వస్త్రాధారణ వారంటే తెలియని అభిమానం మనసులో కలిగేలా ఉండేవారు. కానీ ఇప్పటి హీరోయిన్స్ దాచుకోవడానికి ఏమి లేవన్నట్లుగా అన్ని చూపిస్తూ, ముసలివాడి ఒంట్లో కూడా సెగలు రేపుతున్నారు.

 

 

ఇక మగవాళ్లకు సిక్స్ ప్యాక్‌లా, ఆడవారికి జీరో ప్యాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జీరో ప్యాక్ మెయింటెన్ చేసే హీరోయిన్స్ రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. ఇకపోతే ముఖ్యంగా తెలుగు హీరోలు నాజూకు హీరోయిన్స్‌ను మాత్రమే ఇష్టపడతారట. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం బొద్దు గుమ్మలను కూడా నచ్చుతారు. కాని తెలుగు హీరోయిన్స్‌ మాత్రం బొద్దుగా ఉంటే ఇక్కడి ప్రేక్షకులు కూడా వద్దు బాబోయ్‌ అంటారు. అందుకనేమో  ఈ లిస్ట్‌లో ఇప్పుడు పూజా హెగ్డే చేరిందనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా పూజా లుక్ చూసిన వారు ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు.

 

 

మామూలుగానే తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌ అని చెప్పుకునే వారంత సన్నని నడుముతో నాజూకు అందంతో ఉంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అగ్ర కథానాయకుల అందరితో కలిసి నటించే అవకాశాలు చేజిక్కించుకుంటున్న పూజా అందాల ఆరబోత విషయంలో ఎలాంటి మోహమాటం లేనట్లుగా ఉంటుందనే టాక్. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయట.

 

 

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే తాజా ఫొటో షూట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వెడ్డింగ్‌ అఫైర్‌ అనే మ్యాగజైన్‌ కోసం పొటో షూట్‌ ఇచ్చిన పూజా హెగ్డే మరీ బక్క పలుచగా, మెడ కింది ఆమె ఎముకలు బయటకు వచ్చి కనిపిస్తున్న ఫోటో ఒకటి చూసిన వారికి పిచ్చెక్కిస్తుందట. ఈ ఫొటోను చూసి జనాలు మరీ ఇంత సన్నగా అవసరమా పూజా, జీరో సైజ్‌ ఓకే కాని మరీ ఇంత జీరో సైజ్‌ ఏంటీ అమ్మడు అంటూ ప్రేమ ఒలకబోస్తూ ప్రశ్నిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: