తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు మాటల రచయిత గా పరిచయమయ్యి ఎన్నో  హిట్ సినిమాలకు మాటలందించిన ఘనత ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ కె దక్కుతుంది. ఎన్నో సినిమాలకు మాటలందించి త్రివిక్రమ్ చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అందుకే త్రివిక్రమ్ అందరికి బాగా దగ్గరయ్యాడు. మంచి పేరును కూడా తెచ్చుకున్నారు. 

 

అలా కొన్ని సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన ఆయన తర్వాత అతడు సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలన్న సిద్ధాంతాలను త్రివిక్రమ్ ఎప్పుడు కట్టుబడి ఉంటాడన్న సంగతి తెలిసిందే.. ఆయన సినీ కెరియర్లో ఎక్కువ సినిమాలు మెగా హీరోలతో నే చేసాడు. 


పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలను తెరకెక్కించిన ఆయన ఒక్క సినిమాను మాత్రమే హిట్ గా అందుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు.అంతేకాకూండా ఈ సినిమాలతో బాక్సాఫీస్ ను కూడా షేక్ చేశాడన్న సంగతి తెలిసిందే..

 

ఇది ఇలా ఉండగా గతంలో ఓ సారి రామ్ చరణ్ తో సినిమా తీయాలనుకున్న త్రివిక్రమ్.. ఆయనను సంప్రదించాడట.. దానికి నిర్మాత  అడ్డుకున్నాడట. ఎందుకు అన్న విషయం మాత్రం ఇంతవరకు అర్థం కానీ ప్రశ్నలా మిగిలిపోయింది. వారిద్దరి మధ్య ఉన్న విభేదాలే కారణమని సినీ వర్గాల టాక్.. ఇకపోతే ప్రస్తుతం అల్లుఅర్జున్ తో అల వైకుంఠపురములో  సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు  సిద్ధంగా ఉంది..

 అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హిట్ అవుతుందనే మాటలు సినీ ఇండస్ట్రీలో  వినపడుతున్నాయి. ఈ సినిమా తర్వాత ఏ హీరో తో చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: