స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. బన్నీ సరసన అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా కమెడియన్ సునిల్, కన్నడ నటుడు జయరాం, రాహుల్ రామకృష్ణ, నవదీప్, మురళి శర్మ, సముద్ర ఖని, నివేత పేతురాజ్, అక్కినేని సుశాంత్ థర్డీతరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ స్వర పరిచిన ఈ సినిమాలోని సాంగ్స్ కు ఇప్పటికే శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నేడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుగగా సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది. 

 

కాగా ఈ సినిమాపై సెన్సార్ అధికారులు అద్భుతమైన రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేశారని, తండ్రి కొడుకులు మధ్య అనుబంధంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంటర్టైన్మెంట్, పంచ్ డైలాగ్స్ వంటివి త్రివిక్రమ్ అదరగొట్టారని, ఇక సినిమాలో అల్లు అర్జున్ పాత్ర అయితే అదిరిపోయిందని అన్నారట. సినిమాలో ముఖ్యంగా పాటలు విజువల్ గా కన్నుల పండుగగా ఉన్నాయని, కీలకమైన యాక్షన్ సీన్స్ తో పాటు ఆ సీన్స్ కు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పడం జరిగిందట. అలానే సినిమాను మలుపు తిప్పే పాత్రలో టబు నటించగా, హీరోయిన్ గా పూజ హెగ్డే మంచి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలో నటించిందని, 

 

వారితో పాటు నటులు మురళి శర్మ, సముద్రఖని వారి వారి పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారట. సినిమా తప్పకుండా రేపు రిలీజ్ తరువాత అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి సక్సెస్ ని కూడా అందుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారట. కాగా ఈ న్యూస్ బయటకు రాగానే బన్నీ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టేసారు. ఇప్పటికే బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి హిట్ అందుకోగా, ఈ సినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆనందపడుతున్నారు. కాగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: