రామోజీరావు నిర్మించిన ఇష్టం సినిమాతో శ్రియ టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే వచ్చినప్పుడు శ్రియ సౌత్ లో ఇంతకాలం నిలబడుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు. కానీ ఎవరీ ఊహకి అందని విధంగా టాలీవుడ్ లో యంగ్ హీరోస్ తోనే కాదు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇలా వరుస బెట్టి స్టార్ హీరోలందరి తోను నటించింది. అంతేకాదు టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇక కోలీవుడ్ లో విక్రం, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి టాప్ స్టాత్ర్స్ తో నటించింది. ఇక కొన్నాళ్ళ క్రితం పెళ్ళి చేసుకున్న శ్రియ మళ్ళీ సినిమాలు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ విషయంలోను షాకిచ్చింది. అసలు సినిమాలకు దూరం అయ్యో ప్రసక్తే లేదని క్లారిటి ఇచ్చింది. 

 

ఇక వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అసురన్ రీమేక్ (తెలుగులో అసురుడు వర్కింగ్ టైటిల్) రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా వెంకీ సరసన శ్రియను తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఈ సినిమా నుండి శ్రియ ని తప్పించి ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు. ఇది ఒకరకంగా శ్రియకి షాకింగ్ న్యూసే. అయితే ఇలా శ్రియ ని తప్పించడానికి బడ్జెట్ కారణమట. అందుకే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. రెమ్యూనరేషన్ పరంగా శ్రియ అందుబాటులోనే ఉన్నపటికి అడిషనల్ గా ఆవిడగారికి అయ్యో ఖర్చులు భరించలేకనే వద్దనుకున్నారట.  ప్రస్తుతం భర్తతో బార్సిలోనాలో ఉంటున్న ఈ అమ్మడు అక్కడ్నుంచి ముంబయికి వస్తుంది. 

 

ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి ముంబయి లేదా బార్సిలోనా వెళ్లిపోతుంది. అసలే అసురన్ రీమేక్ కోసం చాలా తక్కువ బడ్జెట్ కేటాయించుకున్నారు. ఆ కారణంగానే శ్రియ కోసం ఇంత ఖర్చుపెట్టలేకనే నిర్మాత సురేష్ బాబు ఇలా డిసైడయ్యారట. పైగా శ్రీకాంత్ అడ్డాల మేకింగ్ స్టయిల్ కి  నటీనటులంతా ఆయనగారికి అందుబాటులో ఉండాలి. ఏ రోజు ఏ సీన్ తీస్తాడో తనకే పక్కా క్లారిటి ఉండట. అందుకే నిత్యం అందుబాటులో ఉండే ప్రియమణిని ఈ సినిమాలో సెలక్ట్ చేసుకున్నారు.

 

సినిమా కోసం ఆల్రెడీ ప్రియమణి కాల్షీట్లు కూడా కేటాయించింది. ఈనెల 22 నుంచి 4 రోజుల పాటు ప్రియమణి-వెంకటేష్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త నటీనటుల్ని తీసుకున్నారు. ఈ మేరకు కాస్టింగ్ కాల్ నిర్వహించి అందర్నీ సెలక్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లకు వర్క్ షాప్ జరుగుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాం లోకి వచ్చిన మణి వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్ తో క్షణం ఖాలీ లేకుండా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: