న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొని, ఇంకా మనకు ప్రియమైన వారందరికీ శుభాకాంక్షలు చెప్పుకొని మూడు రోజులు అయ్యింది. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాలను నెట్టింట తెగ చెప్పుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారులు, గాయకులు అందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలను తమ అభిమానులకు తెలిపారు. వాటిలో కలకలం రేపుతుందేంటంటే దివంగత పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ తన ఆఫీసియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలను ట్వీట్ చేయడం.

https://mobile.twitter.com/michaeljackson/status/1212056529597337600

ట్విట్టర్ ఖాతాలో "అందరికీ సంతోషకరమైన, ఇంకా ఆరోగ్యకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు!" అని పేర్కొని ఒక మైఖేల్ ఫోటోని జత చేసారు. "కింగ్ ఆఫ్ పాప్" మైఖేల్ జాక్సన్ 25 జూన్ 2009 న కన్నుమూశారన్న విషయం తెలిసిందే. కానీ అతని ఖాతా నుండి వచ్చిన ఒక ట్వీట్ చాలా మంది నెటిజన్ల జోకులకు, ఫన్నీ మీమ్స్‌కు దారితీసింది. మైఖేల్ జాక్సన్ తన సమాధి నుండి ట్వీట్ చేస్తున్నాడని జోక్ లు వేస్తున్నారు నెటిజన్లు.

https://mobile.twitter.com/iBDWR/status/1212468218360713216



దివంగత గాయకుడి యొక్క అధికారిక పేజీలో పాప్ గాయకుడి కోట్స్, ఇంకా చిత్రాలతో ఆ ఖాతాను అప్డేట్ చేస్తుంటారు కొందరు సన్నిహితులు. దీనికి ట్విట్టర్‌లో 2.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దివంగత గాయకుడి అభిమానులతో సంభాషించడానికి ఇది ఒక మార్గం.

https://mobile.twitter.com/SMiTHiE___/status/1212277919357247488

కానీ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పే ట్వీట్ వచ్చినప్పుడు, నెటిజన్లు దాని నుండి నవ్వులు పండించారు. ఏంటీ పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఇంకా బతికే ఉన్నాడా అని కొందరు అడిగారు, మరికొందరు ఆయన సమాధి నుండి ట్వీట్ చేయడానికి ఏ కనెక్షన్ ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ఈ ట్వీట్‌కు చాలా హాస్యాస్పదమైన స్పందనలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: