సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రాబోయే సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు మరియు టీజర్ సోషల్ మీడియాలో అభిమానులను ఫుల్లుగా అలరిస్తున్న తరుణంలో కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్ గట్టిగా వినబడుతోంది. ముఖ్యంగా సినిమాలో మహేష్ తో పాటుగా దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాజకీయ రంగం నుండి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించడంతో సినిమా పై టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇంట్రెస్ట్ నెలకొంది.  మరోపక్క మహేష్ ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధించాలని సినిమాకి సంబంధించిన ప్రమోషన్ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గకూడదని నిర్మాతలకు మహేష్ బాబు సూచించినట్లు సమాచారం.

 

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5 వ తారీఖున ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ‘భరత్ అనే నేను’ సినిమా టైపులో చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు ఏర్పాట్లలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా సెన్సార్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే, సినిమా రిలీజ్ విషయంలో ఇంకా కన్ఫ్యూషన్ కొనసాగుతూనే ఉన్నది.  జనవరి 11 వస్తుందా లేదంటే జనవరి 10 న రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది. అయితే సెన్సార్ రిపోర్టు తర్వాత వచ్చిన ఇండస్ట్రీ టాక్ ప్రకారం సినిమాలో కామెడీ అదిరిపోయిందని అంటున్నారు.

 

సినిమాకు సంబంధించి ట్రైన్ ఎపిసోడ్ ఏకంగా 30 నిముషాలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ సినిమా 2గంటల 40 నిమిషాల నిడివి ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైన్ ఎపిసోడ్ మొత్తం వెంకీ సినిమాలో కామెడీ లానే ఆకట్టుకుంటుందని..సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆర్మీ ఎపిసోడ్ 30 నిమిషాలు చాలా అద్భుతంగా తెరకెక్కించాడని సెకండాఫ్ లో రెండు సూపర్ డూపర్ ఫైట్ లు మరియు ఎమోషనల్ సీన్స్ అలాగే క్లైమాక్స్ సినిమాకే హైలెట్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే కొత్త ఏడాది సంక్రాంతి లో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా ఇండస్ట్రీ లో వినపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: