బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో రెచ్చిపోతున్న బ్యూటీ కియరా అద్వాని ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ లో తన హాట్ అటెంప్ట్ తో ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ నుండి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాతో టాలీవుడ్ లో కూడా హిట్ అందుకుంది. ఇక రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా కూడా సినిమా ఫ్లాప్ అయినా కియరాకి మంచి పేరే తెచ్చింది.

 

తెలుగులో అవకాశాలు వస్తున్నా బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉంటుంది కియరా అద్వాని. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో అదే రేంజ్ లో అమ్మడి మీద రూమర్స్ కూడా వస్తున్నాయి. తను ఇప్పటికి సోలోగానే ఉన్నా ఎవరితో డేటింగ్ లో లేనని చెబుతున్న కియరా మాటలు నిజం కాదని తెలుస్తుంది. బాలీవుడ్ హ్యాండ్సం హీరో సిద్ధార్థ్ మల్ హోత్రాతో కియరా ప్రేమాయణంపై ఇప్పటికే బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. అయినా సరే ఇద్దరు తమ మధ్య అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్ గా కియరా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లో మరోసారి అడ్డంగా బుక్ అయ్యింది.

 

కియరా ఓపెన్ టాప్ జీపులో జిరాఫీని దగ్గరగా చూస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. పక్కనే వీడియో షూట్ చేస్తున్న వ్యక్తి వావ్ అనేశాడు. అయితే ఆ వాయిస్ సిద్ధార్థ్ మల్ హోత్రాదే అంటున్నారు. సిద్ధార్థ్ తోనే చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కటింగులు ఇస్తుంది కియరా అద్వాని. బాలీవుడ్ హీరో హోరోయిన్స్ మధ్య ఇలాంటి రిలేషన్ కామనే. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్ హోత్రాతో కియరా అద్వాని షేర్షా సినిమా చేస్తుంది. ఆ సినిమా ఈ ఇయర్ రిలీజ్ అవనుంది. లాస్ట్ ఇయర్ కియరా నటించిన కబీర్ సింగ్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమాతో అమ్మడికి బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: