స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషస్, గీతా ఆర్ట్స్ కలిసి ప్రెస్టిజియస్ గా నిర్మించిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఆల్రెడీ థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు సూపర్ హిట్ అవడంతో పాటుగా సినిమాపై అంచనాలు కూడా పెంచింది. నిన్న సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుండి సూపర్ అనే టాక్ తెచ్చుకుందట.

 

ఇక ఈ సినిమా ప్రీమియర్స్ విషయంలో చాలా ప్రెస్టిజియస్ గా ఉన్నారట. 14 డాలర్ టికెట్ ప్రైజ్ ఓవర్సీస్ లో హ్యూజ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కెరియర్ లో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా ప్రీమియర్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. అంతేకాదు ప్రీమియర్స్ ద్వరానే మిలియన్ మార్క్ అందుకోవాలని భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్, త్రివిక్రం హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

 

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. త్రివిక్రం కూడా అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మరోసారి తన పెన్ పవర్ ఏంటో చూపించడానికి వస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలకు తగినట్టుగానే ప్రమోషన్స్ ఉన్నాయి. అయితే ప్రీమియర్స్ కూడా భారీగా ఉండటంతో సినిమా అక్కడ ఫస్ట్ టాక్ ను బట్టి సినిమా భవితవ్యం ఉంటుంది. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ కు అల వైకుంఠపురములో డబుల్ ధమాకా ఇవ్వనుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: