సూపర్ స్టార్ మహేష్ మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి మహేష్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేస్తుంది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ మళ్లె వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే ఆ తర్వాత సినిమా గీతా ఆర్ట్స్ లో ఉంటుందట. ఆ సినిమా డైరక్టర్ గా ఇన్నాళ్లు పరశురాం పేరు వినపడ్డది. లేటెస్ట్ గా మహేష్ డైరక్టర్ రేసులో మారుతి కూడా ఉన్నాడని తెలుస్తుంది.

 

గీతా ఆర్ట్స్ లో తీసిన భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మారుతి స్టార్ డైరక్టర్ గా ప్రమోషన్ అందుకున్నట్టే లెక్క. సాయి తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మారుతి గీతా ఆర్ట్స్ మహేష్ కాంబినేషన్ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడట. అందుకే మారుతి మహేష్ ను ఇంప్రెస్ చేసే కథ రాయాలని ఫిక్స్ అయ్యాడట. మారుతితో మహేష్ అసలు వర్క్ అవుట్ అయ్యే పనేనా అంటే ఏమో సినిమా పరిశ్రమలో ఏదైనా జరగొచ్చు మహేష్ ను మెప్పించే కథ రాస్తే మారుతితో మహేష్ సినిమా తీసినా తీస్తాడని అంటున్నారు.

 

ప్రతిరోజూ పండగే సినిమాతో మారుతి మరో మెట్టు పైకి ఎక్కాడు. సాయి తేజ్ కు ఈ సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చింది. చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాతో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్ క్రెడిట్ అంతా మారుతికే దక్కుతుందని చెప్పొచ్చు. మరి మల్టీ టాలెంటెడ్ అయిన మారుతికి మహేష్ బాబు ఛాన్స్ ఇస్తాడా.. ఒకవేళ మహేష్ అపాయింట్మెంట్ ఇచ్చినా అతన్ని ఇంప్రెస్ చేసే కథ మారుతి సిద్ధం చేస్తాడా అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: