ప్రస్తుతం సినీ పరిశ్రమలో హర్రర్ జోన్ తో పాటు కామెడీ టచ్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ పెరిగిపోయింది.  ఒకప్పుడు విఠలాచార్యులు తీసిన సినిమాల్లో దెయ్యం, అస్తి పంజరాలతో, రక రకాల జంతువులతో సందడి చేస్తూ నవ్వించేవారు.  ఇక లారెన్స్ తెరకెక్కించిన ‘ముని’ సినిమా తర్వాత హర్రర్ జోనర్ లో వచ్చే సినిమాల ట్రెండ్ మారాయి.  హర్రర్ తో పాటు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు.  ఈ నేనథ్యంలో వచ్చిన మూవీ ‘చంద్రముఖి’.  వాసు దర్శకత్వంలో రజినీకాంత్, నయనతార జంటగా నటించిన  ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఈ మూవీపై ఎన్నో పేరడీ లు కూాడా వచ్చాయి.  అయితే అంత గొప్ప హిట్ సినిమా సీక్వెల్ గా మరో మూవీ వస్తుందని భావించారు.  కానీ అది మాత్రం పెండింగ్ పడుతూనే ఉంది.  తాజాగా ఇప్పుడు రజినీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.

 

సినిమా 20015లో విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. కన్నడ వెర్షన్ ‘ఆప్తమిత్ర’ను డైరెక్ట్ చేసిన పి.వాసు ఈ సినిమాకు దర్శకుడు.  ఇప్పుడు ఈ ప్రయత్నం తమిళంలో జరగనుంది. అధికారికంగా ప్రాజెక్ట్ అనౌన్స్ కాకపోయినా సీక్వెల్ పనులైతే వేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలో వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ చంద్రముఖి సీక్వెల్ అనుకున్నా అది పెద్దగా హిట్ కాలేదు.

 

ఇక ఈ కొనసాగింపులో ప్రధాన పాత్రదారులు ఎవరనేది కూడా ఇంకా ఫైనల్ కాలేదట. మరి  ’చంద్రముఖి’లో రజనీ, ప్రభు, జ్యోతిక, కె.ఆర్.విజయ,  నయనతార లాంటి స్టార్లను తీసుకున్న డైరెక్టర్ పి.వాసు ఈ సెక్వెల్ కోసం ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.  మరి ఈ సారి తెరకెక్కుతున్న ఈ మూవీ రజినీకాంత్మాయ చేస్తారో.. ఎలా మెప్పిస్తారు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ ‘దర్భార్ ’ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీలో రజినీకాంత్ సరసన ఎంతో గ్యాప్ తర్వాత నయనతార నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: