సినీ పరిశ్రమలో కొన్ని చిత్రాలు కొందరి కోసమే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అలాంటి చిత్రాల్లో ఆ హీరో అయితేనే మంచి పర్ఫామెన్స్ చేయగలరని ఆడియన్స్ కూడా అభిప్రాయ పడుతుంటారు. తాజాగా ఇదే విషయం ప్రముఖ దర్శకులు మురుగదాస్ అంటున్నారు. మురగదాస్ మాట్లాడతుూ.. రజనీకాంత్‌తో తాను చేసిన తొలి సినిమా ఇదేనన్నారు. చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఎంతో అభిమానించేవాడినని.. దర్శకుడిగా మారిన తర్వాత ఒక్క సినిమా అయినా రజినీ సార్ తో తీయాలని భావించానని అన్నారు.  తాను డైరెక్ట్ చేసిన తొలి పోలీస్ స్టోరీ కూడా ఇదేనని పేర్కొన్నారు.  ఈ మూవీలో అందరూ బాగా కష్టపడి పనిచేయడంతో సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది.

 

అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి.  చంద్రముఖి తర్వాత రజినీతో నయనతార మళ్లీ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు.  ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.ఇక ఈ సినిమా నిర్మాత సుభాస్కరన్ నిజ జీవిత హీరో అని, భవిష్యత్తులో ఆయనపైనా బయోపిక్ తీయవచ్చని మురుగదాస్ పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమాకు కావాల్సింది ఇలాంటి నిర్మాతలేనన్నారు. దర్బార్’లో నయనతార, నివేదా థామస్‌లు చాలా చక్కగా నటించారని ఆయన కొనియాడారు.

 

రజనీకాంత్‌తో పోటీపడి మరీ సునీల్ శెట్టి విలనిజాన్ని పండించారని మురుగదాస్ ప్రశంసించాడు. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫైతో భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్దమవుతుంది.  ఈ మూవీ  రన్‌ టైమ్ 2 గంటల 39 నిమిషాల అని తెలుస్తోంది.  ఇటీవల కాలంలో రజినీ నటించిన కబాలి, కాలా, పెట్టా లాంటి సినిమాల్లో మాఫియా తరహా పాత్రలో కనిపించారు రజినీకాంత్.  చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఎలా మెప్పించబోతాడా అని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: