తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్  కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దర్బార్'. ఈ చిత్రం జనవరి 9న తమిళం తోపాటు తెలుగు,హిందీ లోనూ  విడుదలకానుంది.  దాంతో నిన్న ఈచిత్రాన్ని సెన్సార్ కు పంపించగా  బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చి 11 కట్లు చెప్పింది. అందులో భాగంగా  సినిమాలో  వచ్చే  సెల్ ఫోన్  లోని  అసభ్యకరంగా  వున్న ముద్దు  సన్నివేశాన్ని తొలిగించాల్సి గా సూచించింది. దాంతో పాటు  సినిమాలో వాడిన  తమిళ భాషలోని  అసభ్యకర పదాన్ని  అలాగే వీటితో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను తొలిగించాల్సిందిగా చిత్ర యూనిట్ ను కోరింది. ఇక ఈ చిత్రం 2గంటల 59నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానున్నడం విశేషం.  కాగా తెలుగు వెర్షన్  కూడా ఈ రోజు సెన్సార్ కు వెళ్లనుంది.  యాక్షన్ ఎంటర్టైనర్  గా తెరకెక్కిన  ఈ చిత్రంలో  రజినీ, ఆదిత్య అరుణాచలం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా  ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. వీరితోపాటు  బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. 
 
 
ఇటీవల  విడుదలైన  ఈచిత్రం యొక్క ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకోవడం అలాగే మురగదాస్ - రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో  దర్బార్  పై  తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి  అంచనాలు వున్నాయి.  ఇక  ఈ చిత్రానికి తమిళ్ లో  ఎదురులేకున్నా  తెలుగులో మాత్రం  గట్టి పోటీ ఎదురుకానుంది. సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ  రెండు బడా సినిమాలు  సరిలేరు నీకెవ్వరు , అల..  వైకుంఠపురములో బరిలో వున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: