టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్ త్రివిక్రమ్ - అల్లు అర్జున్.  వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాన్ని సాధించాయి.  ఇక నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీ డిజాస్టర్ తర్వాత బన్నీ దాదాపు రెండున్న సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు.  సాధారణంగా తమ అభిమాన హీరో సంవత్సరానికి ఒకటీ రెండు సినిమాల్లో కనిపిస్తే చాలా తక్కువగా నటిస్తున్నారని అభిప్రాయపడే అభిమానులు అల్లు అర్జున్ తీసుకున్న లాంగ్ గ్యాప్ తో ఎంతో నిరాశకు లోనయ్యారు.  దాంతో అభిమానులను మరింత  నిరాశకు లోను కావడం ఇష్టపడని అల్లు అర్జున్ గతంలో తనకు మంచి హిట్స్ అందించిన త్రివిక్రమ్ తో రెడీ అయ్యారు.  వీరిద్దరి కాంబినేషన్లో ‘అలా వైకుంఠపురములో’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 

ఈ మూవీకి సంబంధించిన లిరికల్స్ సామజవరగమనా, రాములో రాముల సూపర్ హిట్ అయ్యాయి.  ఇక సంక్రాంతి కానుకగా మురగదాస్-రజినీ కాంబినేష్ లో ‘దర్భార్’, అనీల్ రావిపూడి-మహేష్ బాబు కాంబినేషన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీస్ వస్తున్నాయి.  అయితే మహేశ్ బాబు, రష్మిక నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ 11వ తేదీన విడుదల చేయనున్నారు.  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ రూపొందించిన 'అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు. అయితే 'అల వైకుంఠపురములో' నిర్మాతలు తమ సినిమా విడుదల విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారనీ, ఈ సినిమాను జనవరి 10వ తేదీనే విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  అయితే రజినీకాంత్ దర్భార్ 9న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

 

అయితే మురుగదాస్ - రజినీకాంత్ కి తెలుగు, తమిళ్ లో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.  దర్భార్ గనక హిట్ టాక్ వస్తే ఆ ఎఫెక్ట్ బన్నీ మూవీపై పడుతుందా అన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  మరోవైపు  'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు కూడా జనవరి 10వ తేదీనే తమ సినిమాను కూడా బరిలోకి దింపాలనే దిశగా ఆలోచన చేస్తున్నారని సమాచారం. అయితే ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు.. టాలీవుడ్ లో మాత్రం గుస గుసలు వినిపిస్తున్నాయి.  ఈ రెండు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధత ఏర్పడటంతో, అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: