చిన్న మిస్టేక్స్ దొరికితే చాలు నెటిజన్లు ట్రోలింగ్ తో ఆడేసుకుంటున్నారు. మెగా వారసుడు రామ్ చరణ్ ని నెటిజన్స్ లాస్ట్ ఇయర్ ట్రోలింగ్ తో రౌండప్ చేశారు. ట్రోలింగ్ లో చెర్రీ గత ఏడాది టాప్ లో నిలిచాడు. ఇంతకీ రామ్ చరణ్ చేసిన మిస్టేక్స్ ఏంటో ఓ సారి  పరిశీలిస్తే.. !


రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అంతేకాదు యాక్టింగ్ రాదన్న విమర్శలకు రంగస్థలం సినిమాలోని నటనతో చెర్రీ గట్టి సమాధానం ఇచ్చాడు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ జీవించేశాడు. ఈ సినిమాకు ముందు ధృవ చిత్రంలో సైతం సటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ స్టోరీ సెలక్షన్ లోనూ నటనలోనూ బాగా ఇంప్రూవ్ అయ్యాడు అనుకుంటున్న టైమ్ లో.. గతేడాది వచ్చిన వినయ విధేయ రామ చిత్రం పెద్ద షాక్ ఇచ్చింది. 

 

బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది. ట్రైన్ పైన నిలబడి బీహార్ వెళ్లడం. విలన్ల తలలు నరికితే గద్దలు ఎత్తుకెళ్లడం లాంటి సీన్లపై భయంకరమైన ట్రోల్స్ పడ్డాయి. దీంతో చరణ్ మళ్లీ రొటీన్ కథల్ని ఎంచుకున్నాడేంటని మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపించాయి. వినయ విధేయ రామలోని లాజిక్ లేని ఈ సీన్సే రామ్ చరణ్ మీద ట్రోలింగ్ కు కారణమయ్యాయి. 

 


వినయ విధేయ రామ సినిమా పుణ్యమా అని రామ్ చరణ్ 2019 ట్రోలింగ్ లిస్ట్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. చరణ్ మీద మాత్రమే కాదు బోయపాటి శ్రీను మీద కూడా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోలింగ్ తో ఆడుకున్నారు. నిజానికి వినయ విధేయ రామ డైరెక్టర్ ఫెయిల్యూర్ మూవీ. కానీ ఇలాంటి చెత్త సినిమాను ఎంచుకున్నందుకు ఆ ఎఫెక్ట్ మెగా వారసుడి మీద కూడా పడింది. మొత్తానికి వినయ విధేయ రామ వల్ల చెర్రీ లాస్ట్ ఇయర్ ట్రోలింగ్ లో టాప్ లో నిలిచాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: