సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు గా రాబోయే సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయటానికి రెడీ అవుతున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి సినిమా పోస్టర్ రిలీజ్ విషయంలో మరియు విడుదల విషయంలో ఇద్దరు స్టార్ హీరోలు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంటలు రేపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతికి వస్తుండగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠ పురంబులో’ సినిమాతో పండగకి రాబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడం జరిగాయి.

 

ఇటువంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ తేదీల విషయంలో ఇద్దరు స్టార్ హీరోల నిర్మాతలకు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూర్చోబెట్టి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల అయితే ఇండస్ట్రీ కి నష్టం మరియు అదే విధంగా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉందని నచ్చ చెప్పినా గాని రెండు సినిమాల హీరోలు మరియు నిర్మాతలు ఎక్కడా కూడా తగ్గటం లేదని ముఖ్యంగా ఏరియావైజ్ డిస్ట్రిబ్యూషన్ లో కొన్ని గొడవలు వచ్చి ఇద్దరూ కాంప్రమైజ్ కి సిద్ధంగా లేకపోవడం వల్ల ఒకే రోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

సినిమా రిలీజ్ తేదీ విషయంలో ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిగా వెనకడుగు వేసి ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉండాలని కాంప్రమైజ్ అయిన సందర్భంలో అదే తరుణంలో అల్లు అర్జున్ సినిమా యూనిట్ కి చెందిన వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టు అయ్యి మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకంటే ముందే రిలీజ్ చేయాలని ఆలోచించడం తో మహేష్ కూడా అల్లు అర్జున్ సినిమా తో తన సినిమా రిలీజ్ చేయాలని..వెనకడుగు ఇంకా వెయ్యి అక్కర్లేదు యుద్ధానికి సిద్ధంకండి అన్నట్టుగా మహేష్ వ్యవహరించినట్లు ఫిలింనగర్ టాక్. ఒకే రోజు ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో నువ్వానేనా అన్నట్టుగా రికార్డుల విషయంలో బెట్టింగ్ లు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: