తెలుగు లో కథానాయిక ప్రియమణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతోమంది బడా హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. ఏకంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి 17ఏళ్ళు  అయినప్పటికీ కూడా ప్రియమణికి ఇంకా అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ అమ్మడు సీనియర్ హీరోయిన్ అయిన తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ అమ్మడు అంతగా ఆకర్షించిన లేకపోయింది. దీంతో అవకాశాలు కూడా తగ్గడంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ప్రియమణి. ఆ తర్వాత ప్రియమణి పెళ్లి చేసుకోవడంతో సినిమా  అవకాశాలు రాలేదు. అయితే ఈ అమ్మడు సినిమాలకు దూరం అయిన ప్పటికీ బుల్లితెరపై రియాల్టీ షోస్..వెబ్ సిరీస్ లలో  నటిస్తూ తన సత్తా చాటుతోంది. 

 


 ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ మొదటి  సిరీస్ లో నటించి తన సత్తా చాటింది ప్రియమణి. అయితే ఈ అమ్మడు తెలుగులోనే కాదు తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. సినిమా అవకాశాలు లేక పోయినప్పటికీ వెబ్ సిరీస్ లతో టీవీ రియాలిటీ షోలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రీమేక్ కానున్న అసూరన్  సినిమాలో  కథానాయకిగా  ఛాన్స్ కొట్టేసింది ప్రియమని . మరి అసూరన్  సినిమాలో మరోసారి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత  ప్రియమణి మరిన్ని అవకాశాలు చేజిక్కించుకునే  అవకాశం ఉందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇకపోతే నటీనటులు అందరికీ ఒక డ్రీమ్ రోల్  ఉంటుంది అన్న  విషయం తెలిసిందే. అలాంటి పాత్ర వస్తే తనలోనే అసలు సిసలైన నటనను బయటకు తీసుకురావాలని అవకాశం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ నటీనటులు. 

 


 తాజాగా ప్రియమణి తన డ్రీమ్ రోల్ ఏంటో చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన ప్రియమణి... తాను నటిగా వెండితెరకు పరిచయమై 17 ఏళ్లు గడిచిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. 17 ఏళ్ల సినీ ప్రయాణంలో ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన మీ డ్రీమ్ రోల్ ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నారు అని... నా డ్రీమ్ రోల్ ఏమిటి అంటే రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో  రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి తరహా పాత్రలో  నటించాలన్నది నా డ్రీమ్ రోల్  అంటూ చెప్పుకొచ్చింది. నా వాయిస్ నీకు నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్రకు బాగుంటుందని కొంతమంది అంటుంటారు అందుకే అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి: