ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న రెండు బడా సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలపై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మహేష్, అనిల్ రావిపూడి ల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు రూపొందుతోంటే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మూడవ కాంబినేషన్ లో అలవైకుంఠపురములో తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి, ప్రస్తుతం సరిలేరు తో హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంటే, మరోవైపు ఇప్పటివరకు త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల కాంబోలో వచ్చిన జులాయి

 

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, ప్రస్తుతం తెరకెక్కుతున్నఅలవైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టి వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేయాలని చూస్తున్నారు. మొన్నటి వరకు సరిలేరు జనవరి 11న, అలవైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ అవుతాయని ఆయా సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఇక నిన్నటి నుండి ఈ సినిమాల రిలీజ్ విషయమై కొద్దిపాటి అంతర్గత రగడ జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా జనవరి 10, లేదా 11న వచ్చే అవకాశము గట్టిగా కనపడుతున్నట్లు చెప్తున్నారు. అదే కనుక జరిగితే నిర్మాత దిల్ రాజుకు పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. 

 

నిజానికి సరిలేరు సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, ఆ సినిమా నైజాం హక్కులని 33 కోట్లకి కొన్నారు. అలాగే అల వైకుంఠపురములో సినిమా వైజాగ్ / ఉత్తరాంధ్ర రైట్స్ ని 26 కోట్లకి కొనుగోలు చేసాడు. సో రెండు సినిమాలు ఒకే రోజు వస్తే రెండు సినిమాలకి నష్టమే, అంతే కాకుండా దిల్ దిల్ రాజుకి డిస్ట్రిబ్యూటర్ గా పెద్ద దెబ్బ తగిలే అవకాశం మెండుగా ఉంది, దానితో పాటు థియేటర్స్ సమస్య భారీగా ఉంటుంది. అలానే ఆయనతో పాటు ఈ రెండు సినిమాల రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్ల పరిస్థితి కూడా ఇబ్బందుల్లో పడ్డట్లే, ఎందుకంటే ఏ సినిమాకి కూడా భారీగా ఓపెనింగ్స్ రాకపోగా, రెండిట్లో వీక్ టాక్ వచ్చిన సినిమా పరిస్థితి ఎంతో ఘోరంగా తయారయ్యే అవకాశం కూడా కనపడుతోందట. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజున వస్తాయా, లేక వేరు వేరు రోజుల్లో వస్తాయా అనేది తెలియడానికి మరొక రోజు సమయం పడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: